India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లాలో ఎరువులు సంవృద్ధిగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఆగస్టు నెలకు యూరియా 7,806 మెట్రిక్ టన్నులు(MT) అవసరం అవ్వగా 11,877 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. DAP 5,785 MTకి 3,756 MT అందుబాటులో ఉన్నాయి. MOP 236 MTకి 757 MT అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్ 5,205 MTకి 21,017 MT అందుబాటులో ఉన్నాయి. SSP 1,057 MTకి 1,741 MT అందుబాటులో ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో మొత్తం 2.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1.33 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అందులో 1.54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా ఉండగా ఇప్పటికి 1.03 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల అధిక వర్షాలకు 70 వేల ఎకరాల్లో వరి పైర్లు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వెదపద్ధతిలో సాగు చేసిన ఈ పైరు దెబ్బతినడంతో మళ్లీ పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్.
☞ గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్.
☞ తెనాలి: యువకుడిని బెదిరించి దారి దోపిడీ.
☞ గంజాయి కేసులో 14 మంది అరెస్ట్.
☞ తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం.
☞ మంగళగిరి: మంగళగిరిలో పొల్యూషన్ బోర్డు తనిఖీలు.
☞ పొన్నూరు: పోలీసుల విచారణకు హాజరైన అంబటి మురళీ.
☞ డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO.
గంజాయి తరలిస్తూ విశాఖపట్నం (D) కంచరపాలెం పోలీసులకు గుంటూరు(D)కు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. వీరిలో ఓ యువతి కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 12న సుభాష్ నగర్ వద్ద కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి మృతిచెంది. పోలీసులు కారు సీజ్ చేశాక తనిఖీ చేస్తున్న సమయంలో 21 కిలోలు గంజాయి కారులో గుర్తించారు. కేసు నమోదు చేసి గుంటూరు జిల్లాకు చెందిన అక్షయ గౌతమి, బాపట్లకు చెందిన మహమ్మద్ జాకీర్ను అరెస్ట్ చేశారు.
ప్రజలు సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు, కానీ గుంటూరు జిల్లాలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే ఏకంగా పోలీస్ సిబ్బందే భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్టేషన్ పరిధిలో సచివాలయం, హైకోర్టు ఉండటం వల్ల ఇక్కడ విధులు నిర్వహించడం అంటే వెట్టిచాకిరితో సమానమని అంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో కేవలం 10% మాత్రమే HRA వస్తుందని, చుట్టుపక్కల స్టేషన్లలో 16% వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
గుంటూరు జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడీల క్రియేషన్లో వెనుకబడి ఉన్నాయని DMHO విజయలక్ష్మీ అన్నారు. గురువారం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆమె సూచించారు.
గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 70,000 ఏ/సి మిర్చి సరకు వచ్చింది. వివిధ రకాల ధరలు కిలోకు ఈ విధంగా ఉన్నాయి. తేజా ఏ/సి రూ. 130-150, 341 ఏ/సి రూ. 120-155, నెంబర్ 5 ఏ/సి: రూ. 125-150, యల్లో రకం రూ. 200-240, నాటు 334 రకం రూ. 90-135, నాటు సూపర్ టెన్ రూ. 90-145, తేజా తాలు: రూ. 80-95, అన్ని రకాల తాలు: రూ. 50-75 వరకు పలికాయి. మిగిలిన రకాల ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.SC. ఫారెస్ట్రీ 4వ, ఇంటిగ్రేటెడ్ M.A. పబ్లిక్ పాలసీ సెకండియర్ 4వ, M.B.A.(మీడియా మేనేజ్మెంట్) 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
గుంటూరు జిల్లాలో ఐటీఐలో చేరదలచిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఖాళీగా ఉన్న సీట్లను పూరించేందుకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరైతేనే సీటు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
గుంటూరు జిల్లాలో దోమల నివారణకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రజల సొంత వ్యయమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 7 లక్షల కుటుంబాలు ఒక్కొక్కటి నెలకు సగటున రూ.100 దోమల నివారణ ఉత్పత్తులపై ఖర్చు చేస్తే, ఏడాదికి సుమారు రూ.100 కోట్ల మేర ప్రైవేటు వ్యయం అవుతోంది.
Sorry, no posts matched your criteria.