Guntur

News September 20, 2024

పల్నాడులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులోని ఓ సూపర్ మార్కెట్ వద్ద గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 20, 2024

వెలగపూడి: రాష్ట్రంలో రూ.6585 కోట్లు మంజూరు: మంత్రి

image

రాష్ట్రంలో 384 కి.మి. మేర 7 జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. గురువారం వెలగపూడి లోని సచివాలయంలో ఆయన్ విలేకరులతో మాట్లాదారు. కేంద్ర  రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే  ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 

News September 19, 2024

అమరావతి: పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటినుంచి అంటే?

image

రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News September 19, 2024

గుంటూరు: మాది మంచి ప్రభుత్వం: సీఎం

image

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని గురువారం సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తున్నదన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మంచి ప్రభుత్వం అన్నారు.

News September 19, 2024

నందిగం సురేశ్‌కు రిమాండ్ పొడిగింపు

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా TDP కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News September 19, 2024

గుంటూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్

News September 19, 2024

నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసుల పీటీ వారెంట్

image

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతిచెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేశ్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 19, 2024

స్వచ్ఛతా హీ సేవా సెల్ఫీ దిగిన కలెక్టర్

image

కలెక్టర్ అరుణ్ బాబు స్వచ్ఛతా హీ సేవకు మద్దతు తెలుపుతూ సెల్ఫీ దిగారు. ఐటీసీ బంగారు భవిష్యత్, సెర్చ్ ఎన్జీవో జిల్లా నీరు పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఐ సపోర్ట్ స్వచ్ఛ భారత్ అనే అంశంపై కలెక్టరేట్‌లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. దీనిలో కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు సెల్ఫీ దిగి తమ మద్దతు తెలిపారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల స్థాయిలో తమ తోడ్పాటు అందజేస్తామని చెప్పారు.

News September 19, 2024

హామీలు కార్యరూపం దాలుస్తున్నాయి: లోకేశ్

image

యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా తనకు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీ నెరవేరుస్తూ ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశామని xలో లోకేశ్ తెలిపారు.

News September 18, 2024

రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.