India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
◆సీనియర్లు: ధూళిపాళ్ల నరేంద్ర (6వసారి)
◆యరపతినేని శ్రీనివాసరావు (4వసారి)
◆నాదెండ్ల మనోహర్ (3వసారి)
◆నక్కా ఆనంద్ బాబు (3వసారి)
◆అనగాని సత్యప్రసాద్(3వ సారి)
◆జీవీ ఆంజనేయులు (3వసారి)
◆తెనాలి శ్రావణ్ కుమార్ (2వసారి)
◆తొలిసారి: నారా లోకేశ్, మొహ్మద్ నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి
◆ బూర్ల రామాంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు
◆ భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, వేగేశన నరేంద్ర వర్మ
మంగళగిరి MLAగా నారా లోకేశ్ నేడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆయన హామీలివే..
◆మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు
◆ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు
◆నియోజకవర్గంలోని 20వేల మంది పేదలకు పక్కా ఇళ్లు
◆స్వర్ణ కార హబ్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
◆చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపునకు చర్యలు
◆మంగళగిరి, తాడేపల్లి వాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించడం.
గుంటూరు వెస్ట్ MLAగా గల్లా మాధవి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆమె హామీలివే..
◆UGD పనులు పునఃప్రారంభం
◆హోటళ్లలో ఆహార కల్తీ నియంత్రణ
◆స్వచ్చ గుంటూరు సాకారానికి సులభ్ కాంప్లెక్సుల నిర్మాణం
◆ప్రీలెఫ్ట్తో పాటు పార్కులు అభివృద్ధి
◆కుక్కల బెడదపై చర్యలు
◆రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
◆గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై ఉక్కుపాదం
◆శ్యామల నగర్ RUB, శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి.
కేంద్ర సహాయమంత్రిగా భాద్యతలు స్వీకరించిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు తొలిసారి గుంటూరుకు రానున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టోల్ ప్లాజా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు, కార్యకర్తలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం.. శ్రీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు.
విజయపురిసౌత్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 17న పురిటి బిడ్డతోపాటు తల్లి పావని మృతి చెందిన ఘటనపై, సమగ్ర విచారణతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఆరోగ్య సేవల కో-ఆర్డినేటర్ (DCHS) రంగారావు తెలిపారు. విచారణ నిమిత్తం గురువారం ఆస్పత్రికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తల్లీబిడ్డా మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నానన్నారు.
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమించింది. అతుల్ సింగ్కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్కి ఆదేశాలిచ్చింది.
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమించింది. అతుల్ సింగ్కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్కి ఆదేశాలిచ్చింది.
రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమించిన విషయం తెలిసిందే. అయితే తిరుమలరావు గుంటూరు వాసి కృష్ణ నగర్లోని మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి వరకు, ఆ తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఆయన కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్గా పని చేశారు. అనంతరం 1989లో ఆయన ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్.
మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల పూజల అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ప్రభుత్వంలో కీలక రెవెన్యూ మంత్రిత్వ శాఖను చేపట్టిన అనగాని సత్య ప్రసాద్కు పలువురు అభినందనలు తెలిపారు.
నడికుడి, పొందుగుల రైల్వే స్టేషన్ మధ్య గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. అతని ముఖం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. నలుపు రంగు ప్యాంట్ ధరించి వున్నాడు. కుడి చేతిపైన ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉంది. మృతుడి బంధువులు నడికుడి పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.