India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వైవిఎస్బిజి పార్థసారధి నియమితులయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్గా మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. కేసులు పెండెన్సీ తగ్గించడంలో పార్థసారధి విశేష కృషి చేశారు. ఆయన చొరవతో లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న అత్యధిక కేసులు పరిష్కారం ఆయ్యాయి.

వంట గ్యాస్ ధరలను సిలిండర్కు రూ.50 పెంచుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.826గా ఉంది. దీనిపై డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం పెంచిన ధరతో అసలు ధర రూ. 876కి పెరగనున్నది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 16లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కొ సిలిండర్పై నెలకు రూ.50 చొప్పున రూ.8 కోట్లు, ఏడాదికి రూ.96 కోట్ల భారం మోపనున్నారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వడ్లమూడి నుంచి శుద్ధపల్లికి వెళ్లే దారిలో రేపల్లె-సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. తెలుపు, నీలం రంగు గళ్ల చొక్కా, నీలం రంగు లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లి సీతానగరంలో జరిగిన ఇట్టా వర్ధన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొత్తిక భరత్, ఇసుకపల్లి ప్రకాష్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య పూర్వం జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఉద్భవించిన వివాదం వల్ల జరిగిందని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ సోమవారం వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో నరేంద్ర మోదీ ఈనెలలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి పర్యటించనున్నారు. నేపథ్యంలో వెలగపూడి లోని సచివాలయం వెనుక ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఐఏఎస్ వీర పాండ్యన్ జిల్లా, ఎస్పీ సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

గుంటూరులోని స్వర్ణభారతినగర్లో కుక్కల దాడిలో చనిపోయిన 4ఏళ్ల ఐజాక్ విషాద ఘటనపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు బాలుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మంగళగిరిలో మట్టి పాత్రల తయారీ మళ్లీ ఊపందుకుంది. 300కి పైగా కుటుంబాలు ఈ సంప్రదాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. వేసవిలో పెరిగిన డిమాండ్తో రోజుకు 15 కుండల వరకు తయారు చేస్తూ జీవనా ధారం చేసుకుంటున్నారు. ఎర్రమట్టి కొరత సమస్యగా మారినప్పటికీ కుటుంబాలంతా పట్టుదలతో వృత్తిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇక్కడి మట్టి కుండలు ఎగుమతవుతుండటం విశేషం. ఒక్కొక్క కుండ ధర సుమారు రూ.100 వరకు పలుకుతుంది.

తాడేపల్లిలో ఓ యువకుడు హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహణకు GMC సిద్ధమవుతోంది. స్మార్ట్ టెక్స్, జీఎంసీ సంయుక్తంగా ఈనెల 9న విజ్ఞాన మందిరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతిపైగా అర్హత కలిగిన నిరుద్యోగుల కోసం 50కుపైగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం నుంచి తమ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వర్క్షాప్ ఉదయం 9 నుంచి ప్రారంభవుతుంది.

స్వర్ణభారతీనగర్లో కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కుక్కల సమస్యపై గళమెత్తినా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఐజక్ ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణ పై దృష్టి సారించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.