India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ పి. రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 11,103 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 8,899 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి ప్రకాశరావు మాట్లాడుతూ.. రీ వాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.1,240 చెల్లించి జూలై 2వ తేదీల లోగా అందజేయాలన్నారు.
జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
తనని గెలిపించిన గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని కూటమి నేతలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళగిరి నుంచి గుంటూరు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్కి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్ని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై చేపట్టిన చర్యలపై పవన్తో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు కావలసిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. మంగళవారం చిలకలూరిపేట టౌను, రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
2013లో బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో హోంగార్డుపై కత్తితో దాడి చేసిన ఘటనలో, ఇరువురికి న్యాయస్థానం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఓ కేసు విషయంలో వారిన అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన హోంగార్డుపై వారు కత్తులతో దాడి చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వాణికుమారి వారికి శిక్ష విధించినట్లు తెలిపారు.
గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం సుమారు ఏ/సి 75,000 బస్తాలు చేరాయి. కేజీల వారీగా సీడు రకాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.160 నుంచి 195, సూపర్ డీలక్స్ రూ.200, 341 బెస్ట్ రూ.140 నుండి రూ.175, సిజెంటా బెడిగి రూ.110, రూ.145, 2043 బెడిగి రూ.140, రూ.180, డిడి రకం రూ.130, రూ.170, నంబర్ 5 రూ.140, రూ.175, బుల్లెట్ రూ.110, రూ.170, ఆర్మూర్ రకం రూ.120, రూ.155, రోమి రకం రూ.120, రూ.160 వరకు ధర ఉంది.
మాజీ సీఎం జగన్కు విజయవాడ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా ? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలకు వెళ్దాం. నీకు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, అసలు గెలుస్తావో లేదో చూద్దాం. ఇకనైనా నీ చిలక జోస్యం ఆపు’ అని Xలో పోస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.