Guntur

News December 7, 2024

విజయవాడ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బాపట్ల ఎంపీ

image

బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో ఎంపీ కృష్ణప్రసాద్ రాష్ట్రంలో అమలవుతున్న విపత్తు నిర్వహణ విధానాన్ని, ఇటీవల వచ్చిన వరదల గురించి ఆయనకు తెలియజేశారు. రాష్ట్రంలో విజయవాడతో సహా వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాల వివరాలను ఎంపీ తెన్నేటి, అమిత్ షాకు వివరించారు.

News December 7, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

image

సీఎం చంద్రబాబు శనివారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి బాపట్ల చేరుకుంటారు. పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలో పలు కార్యక్రమంలో పాల్గొని, తిరిగి రాత్రికి హైదరాబాద్‌లోని నివాసానికి వెళతారు.  

News December 6, 2024

బాపట్ల పాఠశాల యాజమాన్యానికి లోకేశ్ ధన్యవాదాలు

image

బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినందుకు మంత్రి లోకేశ్ యాజమాన్య కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు ఈ డిజిటల్ ఇన్విటేషన్లు ఓ ఉదాహరణ. అని ట్వీట్ చేశారు. లక్షలాది మంది పూర్వ విద్యార్థులతో పండుగ వాతావరణంలో Mega PTM జరుపుదామని చెప్పారు. 

News December 6, 2024

గుంటూరు: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.! 

image

గుంటూరు లక్ష్మీపురంలోని ఓ స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ జరుగుతున్న ఉదంతాన్ని చూసి పొలీసులే కంగుతిన్నారు. ఈ క్రమంలో సెంటర్ లోపల ఉన్న పలువురు యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువగా యువతులు ఉండటం గమనార్హం. 

News December 6, 2024

రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు: కలెక్టర్ 

image

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే పౌరులకు ప్రాధమిక హక్కులు లభించాయని కలెక్టర్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. 

News December 6, 2024

చివరి దశలో పేద జీవితాన్ని గడిపిన సావిత్రి

image

తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ఫోటోలు తీయటంతో వారి పరిచయం పెళ్లిగా మారింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీశ్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 1981 డిసెంబరు 26న 46 సంవత్సరాల వయసులో మరణించింది.

News December 6, 2024

మహానటి సావిత్రి పుట్టింది మన తాడేపల్లిలోనే

image

మహానటి సావిత్రి మన తాడేపల్లి మం. చిర్రావూరులో డిసెంబర్ 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. నేడు ఆమె జయంతి సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోగా.. పెదనాన్న వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. ఆమె చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగి.. 250కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 

News December 6, 2024

అమరావతిలో దెయ్యాలు అంటూ వదంతులు

image

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటీవల దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులోని ఓ పాతబడిన రెస్టారెంట్ వద్డ దెయ్యాలు కనిపించాయంటూ.. వారం రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. చిన్నారులు, వృద్ధులు రాత్రి వేళ బయట తిరగడానికి భయపడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను కోరుతున్నారు.

News December 6, 2024

GNT: ANUలో గెస్ట్ ఫ్యాకల్టీ అరెస్ట్

image

ANUలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పృథ్వీరాజ్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం.. పెదకాకాణిలోని నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన యువతి ANUలో ఇంజినీరింగ్ చదువుతోంది. పృథ్వీ ఆ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆతనికి నగదు, లాప్‌ట్యాప్ ఇచ్చినట్లు పేర్కొంది. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

News December 6, 2024

విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు

image

మాజీ మంత్రి విడదల రజిని దళిత రైతుల భూములు లాక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో యడవల్లికి చెందిన దళిత రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విడదల రజిని తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ ఉన్న తమ భూములను లాక్కున్నారని వాపోయారు. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని కోరారు.