Guntur

News June 12, 2024

రజనీకాంత్‌తో ముచ్చటించిన ఎంపీ బాలశౌరి

image

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్న రజనీని.. పాత పరిచయంతో కలిసి ముచ్చటించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తున్న ఆయనతో మాట్లాడుతూ.. ‘సార్.. గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు.. మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఓడిపోయారు’ అని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఇరువురూ ఒకే ఫ్లైట్‌లో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వచ్చారు.

News June 12, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై 36 మంది

image

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా, జితిన్ రామ్ మాఝి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి, కె.రామ్మోహన్, వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై.. చిరంజీవి, రజినీకాంత్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఆశీనులు కానున్నారు.

News June 12, 2024

గుంటూరు జిల్లా నుంచి మంత్రులు వీరే..

image

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. నారా లోకేశ్(మంగళగిరి), నాదెండ్ల మనోహర్ (తెనాలి), అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)కు చోటు దక్కించుకున్నారు. అనగాని సత్యప్రసాద్ తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా.. లోకేశ్ గత TDP ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

News June 12, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

News June 11, 2024

గుంటూరు: చంద్రబాబు నివాసానికి చేరుకున్న అమిత్ షా

image

తాడేపల్లి పరిధి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ చంద్రబాబు అమిత్‌షాకి విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే అమిత్‌షా రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ నోవాటేల్‌లో అమిత్‌షా బసచేయనున్నారు. 

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

News June 11, 2024

మచిలీపట్నం వద్ద లారీ కిందపడి.. రేపల్లె మహిళ మృతి

image

మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందింది. తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయగా.. రాజేశ్వరి ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News June 11, 2024

గుంటూరు జిల్లాలో పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.

News June 11, 2024

గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు.. SP తుషార్

image

ఈనెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానున్నందున, గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ మంగళవారం తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్ వెళ్లాలన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందన్నారు.

News June 11, 2024

ఇగ్లండ్‌లో పల్నాడు జిల్లా యువకుడి మృతి

image

ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్‌ వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24) ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్‌ వెళ్లాడు. అయితే ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం మాంచెస్టర్ నుంచి పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.