India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలని కొల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులకు కొల్లూరు మండలం టీడీపీ సీనియర్ నేత వెంకట సత్యకుమార్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గాజుల్లంక శ్రీకాకుళం మధ్య కాజ్వే నిర్మించాలని, 75 ఎకరాలలో మూతబడి ఉన్న జంపని షుగర్ ఫ్యాక్టరీని మెడికల్ కాలేజీగా మార్చాలని కోరారు.
అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాటకాలు ఆడిన వైసీపీ అధినేత జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారని జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్దమౌతున్నట్లు ప్రకటించారని, దీని ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లుడు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఏఐ రంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
200 ఎకరాల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నూతన మిర్చి యార్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న గుంటూరు మిర్చి యార్డ్పై అనేక విధాలుగా ఒత్తిడి పడుతోందని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు యార్డును తరలిస్తామన్నారు. ఆ స్థలాన్ని వేరే ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు.
పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ అభిమానులు బుధవారం రాత్రి నుంచి థియేటర్ల వద్ద రచ్చ రచ్చ లేపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమాపై స్పందించారు. ‘పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్’ అంటూ తన X ఖాతాలో రాసుకొచ్చారు.
మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 చక్రాల లారీలో ఎవరికి అనుమానం రాకుండా A4 పేపర్ బండిల్స్ మధ్యన సుమారు 50 దుంగలను దాచి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి అస్సాం… అస్సాం నుంచి చైనా దేశానికి ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10.30గంటలకు జిల్లాస్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, భూ సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలు హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
విపత్తుల సమయంలో ప్రజలతో పాటు పశువులను రక్షిత ప్రాంతాల్లోకి తరలించేలా ముందస్తుగా ఆశ్రయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరుజిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. బుధవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలు పశువులను వదిలి పునరావాస కేంద్రాలకు రావటానికి ఆసక్తి చూపటం లేదని కలెక్టర్ తెలిపారు.
11వ శతాబ్దంలో మహాభారతాన్ని తలపించిన పల్నాటి యుద్ధం ఓ మహావీరుని విజయానికి ప్రతీక అని చరిత్ర చెబుతుంది. అతడే మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.. అతి వీర భయంకరుడు ‘మాల కన్నమదాసు’. బ్రహ్మనాయుడి దత్తపుత్రునిగా రాజాజ్ఞను పాటిస్తూ సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఓడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చాడని చరిత్రలో లిఖించబడింది. యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం నేటికీ పూజలందుకోవడం విశేషం.
గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో పలుచోట్ల నాలుగు సెకన్ల పాటు రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ ప్రాంతంలో ఎక్కడైనా కంపించిందా కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.