India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 13వ తేదీన భోగి పండుగను పురస్కరించుకొని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరగదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి తమ అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత జరిగే పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు తెలియజేయవచ్చని అన్నారు.
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభంభించే విధంగా తెలుగింటి పండుగ సంక్రాంతిని ఘనంగా జరుపుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అత్తోటలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమాల్లో కలెక్టర్తో కలిసి పాల్గొన్న ఆయన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గోపూజ చేసి గ్రామంలో మహిళలు తీర్చిదిద్దిన సంక్రాంతి ముగ్గులను ఆసక్తిగా తిలకించారు. గ్రామంలో రూ.1.85 లక్షలతో నిర్మించిన పశువుల షెడ్డును ప్రారంభించారు.
యథార్థమైన బుద్ధుని ధాతువు అయిన బాపట్ల(D)లోని భట్టిప్రోలు స్తూపం ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ఈ స్తూపం క్రీ.పూ.4-3 శతాబ్దాల మధ్య అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ స్తూపం చక్రాకార పథం కలిగి ఉంటుంది. భట్టిప్రోలులో లభ్యమైన అవశేషాల్లోనూ బండరాయి పెట్టెలపైన లిఖించిన శాసనాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. అప్పట్లో ఇది అత్యంత ఐశ్వర్యవంతమైన ప్రాంతంగా పేరొందింది
సైనేడ్ హత్యకేసుల్లో నిందితులను 3 టౌన్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. యడ్ల లింగయ్యకాలనీకి చెందిన వెంకటేశ్వరి, తల్లి రమణమ్మలు సైనేడ్తో హత్యలు చేసిన కేసులో బెయిల్పై వచ్చారు. ఇదే కాలనీకి చెందిన మోషే మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఖననం చేసిన ప్రాంతంలో శవాన్ని తీసి పోస్ట్మార్టం చేశారు. సైనేడ్ వలనే మోషే మృతిచెందినట్టు తేలగా తల్లి, కూతుర్లను అరెస్టు చేశారు.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజ్ వాపస్ చేయబడుతుందని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి పార్థసారథి అన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై గుంటూరులో జరుగుతున్న 40 గంటల శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, న్యాయవాదులు ప్రమీలా ఆచార్య, తకంచన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఖరీఫ్ 2024 కరువు పరిస్థితులపై కేంద్ర బృందం పర్యటించి నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గురువారం కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి నేతృత్వంలోని కేంద్ర బృందంతో రాష్ట్ర స్పెషల్ సీఎస్ ఆర్పీ.సిసోడియా సమావేశమయ్యారు. రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని కేంద్ర బృందానికి సిసోడియా విజ్ఞప్తి చేశారు.
అంబటి, అతని సోదరుడు మురళీకృష్ణ మరికొందరిపై జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లి బాబురావు ఫిర్యాదుతో గురువారం అట్రాసిటీ కేసు నమోదైంది. బాబు రావు కథనం.. భజరంగ్ జూట్ మిల్ వ్యవహారంలో డైరెక్టర్ దావ్ గోపాల్తో అక్రమ సేల్ డీడ్ను రద్దు చేయాలని 2022 HCలో కేసు వేశారు. కేసు వెనక్కి తీసుకోవాలని బాబూరావును బెదిరించారు. దీనిపై గత నవంబరు 15న HCలో పిటిషన్ వేయగా..వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ పిఎంఏ వై 2.0 పథకం క్రింద ఇల్లు నిర్మించుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల-2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. సందర్భంగా అధికారులకు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీలక్ష్మి నరసింహ ఆలయం ముస్తాబవుతోంది. ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. కొండపైన, దిగువన ఉన్న 3 దేవాలయాలు ఉన్నాయి. ఈదేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడి చరిత్ర. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. తెరుచుకున్న రంధ్రమే పానకాలస్వామి అని ప్రజలు నమ్మకం.
వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన పల్నాడు(D) మాచర్ల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్కు చెందిన బత్తుల కల్పన (28) ఉరి వేసుకుందంటూ భర్త సురేశ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు భర్త సురేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.