India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పార్లమెంట్లో రైల్వే అభివృద్ధిపై ఎంపీ కృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. శావల్యాపురం–బాపట్ల కొత్త లైన్పై ప్రస్తుతం గుంటూరు, తెనాలి మార్గంలో సౌకర్యం ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గుంటూరు–విజయవాడ రద్దీ తగ్గించేందుకు ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు, కోటిపల్లి–నర్సాపురం, గుంటూరు–బీబీనగర్, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. 4వ లైన్ డీపీఆర్కు సర్వేలు మంజూరయ్యాయి.

స్వర్ణ ఆంధ్ర @ 2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అన్నీ శాఖలు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) పై వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలను (KPIలు) సాంకేతికత ఆధారిత పనితీరుపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు.

స్వర్ణాంధ్ర @2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్పై అధికారులకు కలెక్టరేట్లో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కీలక పనితీరు సూచికలను సాంకేతికత ఆధారిత పనితీరును పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక కొలమానాలు, లాజిస్టిక్స్, మానిటరింగ్ మెకానిజం అభివృద్ధి చేసుకోవాలన్నారు.

ఆచార్య నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షలను పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కేంద్రంలో కాపీయింగ్కు పాల్పడుతున్న 9 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులను హెచ్చరించారు.

బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలను మార్చి 1న నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల చేసి, 13న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సహా మొత్తం 8 మంది సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హోం గార్డులకు ఎస్పీ వకుల్ జిందాల్ నగదు చెక్కులను అందజేశారు. తోటి హోం గార్డులు తమ ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా విరాళంగా సేకరించి సమకూర్చిన రూ.2.31 లక్షలు, రూ. 2.21 లక్షల మొత్తాలను వారికి అందజేశారు. ఎస్పీ వారి సుదీర్ఘ సేవలను కొనియాడారు. హోం గార్డుల మధ్య ఉన్న ఐక్యత, తోటివారికి అండగా నిలిచే గుణాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) సందర్భంగా జిల్లాలోని ప్రధాన శివాలయాలు, తిరునాళ్లు, నదీ తీర ప్రాంతాల్లో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ, హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112/100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా, కేవలం పనివేళల్లోనే సర్వేలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి MPDOలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ‘అక్షర ఆంధ్ర’, ‘యూనిఫైడ్ ఫ్యామిలీ’ సర్వేల పురోగతిని సమీక్షించారు. సిబ్బంది సేవలను సమతుల్యంగా వినియోగించుకోవాలని, సర్వేల నిర్వహణను పర్యవేక్షణ అధికారులు నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది కంటే మెరుగ్గా ఏర్పాట్లు ఉండాలని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో పెండింగ్ నిధులు మంజూరవుతాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు, తాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డ్రైనేజ్, వీధి కుక్కల నియంత్రణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.