India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పండగలు భారతదేశ సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదని, స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోందన్నారు.
విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన UG 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్ యూనియన్(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. విజయ డెయిరీలోని గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటరు రూ.74 ఉండగా తాజాగా పెరిగిన ధరతో రూ.76 కానుంది. ఫుల్ క్రీమ్ లీటరు రూ.72 నుంచి 74 పెరిగినట్లు వెల్లడించారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.
సీఎం చంద్రబాబు ఆదివారం కృష్ణా జిల్లాకు రానున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఉగాది సంబరాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే సంబరాలకు ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు.
అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం అతడితో పాటు పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన ఉమామహేశ్వరరావు, అవనిగడ్డకు చెందిన గోపయ్యస్వామి, వెంకటరమణ పటమట పోలీసులకు అప్పగించారు. వీరు మొత్తం రూ.48లక్షల లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాఫీ షాపులు, కిల్లి కోట్లు కలెక్షన్ పాయింట్లుగా, వాహన నంబర్లతో డబ్బులు లావాదేవీలు చేశారు.
☞ గన్నవరం: 3 గంటలసేపు వంశీని విచారించిన పోలీసులు☞ కృష్ణా: క్రికెట్ బెట్టింగ్ గుర్తు రట్టు☞ రేపు ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్కు సీఎం☞ కృష్ణా: పెరుగుతున్న ఎండలు.. ఆందోళనలో ప్రజలు ☞ కృష్ణా: MBA,MCA ఫలితాలు విడుదల☞ పెదకళ్ళేపల్లి చెరువులో పడిన మహిళ గుర్తింపు☞ కూచిపూడి జిల్లాలో ఉండటం గర్వ కారణం: కలెక్టర్☞ ఆత్కూర్ వద్ద గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
అయ్యప్ప నగర్లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.
కృష్ణ యూనివర్సిటీ (KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన MBA,MCA కోర్సుల 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలపై అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని KRU సుచించింది. రీవాల్యుయేషన్ కై ఏప్రిల్ 15 లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈనెల 31న నిర్వహించాల్సిన 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్టు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 31వ తేదీ రంజాన్ పర్వదినం సందర్భంగా ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజున నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మార్పును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించి సహకరించాలని డీఈఓ కోరారు.
Sorry, no posts matched your criteria.