Krishna

News December 1, 2025

కృష్ణా: తీరప్రాంత ప్రజలకు నెరవేరని మంచినీటి కల.!

image

తరాలు మారినా తమ తలరాతలు మాత్రం మారలేదంటూ సముద్ర తీరం ప్రాంతమైన కృత్తివెన్ను మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా గుక్కెడు మంచినీరు అందించలేకపోయారని, ఇప్పటికీ కుళాయి నీరు అందక మినరల్ వాటర్ ప్లాంట్ నీరే శరణ్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు శుద్ధ జల సరఫరా జరుగుతుందనే ఆశతో చూస్తున్నాం అంటున్నారు.

News December 1, 2025

కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

image

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.

News November 30, 2025

కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.

News November 30, 2025

కృష్ణాజిల్లాలో ఎంత మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే.?

image

కృష్ణాజిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 7,072 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరంతా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, గుడివాడలోని పీ. సిద్దార్థ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2008 గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 12,052 మంది ఉండగా తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 7,072 మందికి తగ్గింది. #InternationalAidsDay.

News November 30, 2025

కృష్ణా జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News November 30, 2025

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో కృష్ణా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో 08672-252399 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులు తాము పండించిన ధాన్యం తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 30, 2025

డిసెంబర్ 4,5,6 తేదీల్లో కృష్ణా తరంగ్-2025

image

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 4,5,6 తేదీల్లో కృష్ణా తరంగ్-2025 వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ ఆవిష్కరించారు. రుద్రవరంలోని విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు వివిధ రకాల అంశాల్లో కల్చరల్ ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా తరంగ్-2025 కన్వీనర్ ఆచార్య దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

News November 30, 2025

కృష్ణా: యువకుడి ప్రాణం తీసిన కుక్క

image

కంకిపాడు మండలం ఈడుపుగల్లు హైవేపై రామాలయం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో వణుకూరుకు చెందిన కుమారవర్ధన్ (28) మృతిచెందాడు. కుమారవర్ధన్ బుల్లెట్‌పై వస్తుండగా, కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 29, 2025

కృష్ణా: కంటైనర్‌లతో ధాన్యం రవాణా.!

image

జిల్లాలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నప్పటికీ రవాణా వాహనాల లభ్యత లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ధాన్యాన్ని లారీలు, ట్రక్కుల ద్వారా స్టాక్ పాయింట్లకు తరలించే విధానాన్ని అనుసరించేవారు. అయితే ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయంగా కంటైనర్లలో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని లోడింగ్ చేసి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు.

News November 29, 2025

నేడే కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

image

కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో వివిధ అంశాలు, ఎంజెండాలపై చర్చ ఉంటుందని చెప్పారు.