Krishna

News September 28, 2024

MLA కొలికపూడి కీలక వ్యాఖ్యలు

image

తిరువూరు MLA సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ఓ పోస్టు తెగ వైరలైవతోంది. ‘అగ్ని పర్వతం బద్దలయ్య ముందు.. భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అని పోస్టు చేశారు. దీంతో ఆయన దేని గురించి ఆ వ్యాఖ్యలు చేసినట్టా అని ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు.

News September 28, 2024

నేడు విజయవాడకు రానున్న శ్రీలీల

image

నేడు విజయవాడకు ప్రముఖ సినీ నటి శ్రీలీల రానున్నారు. ఎంజీ రోడ్డులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు గడ్డే రామ్మోహన్, బోండా ఉమాహేశ్వరరావు, సుజనా చౌదరి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా హాజరుకానున్నారని సమాచారం.

News September 28, 2024

కృష్ణా: గృహ నిర్మాణ లబ్ధిదారులతో అవగాహన సదస్సులు

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి గృహ నిర్మాణంపై క్షేత్రాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోనూ, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.

News September 27, 2024

కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్శిటీ పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3, 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల(సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుండి 30 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడవచ్చంది.

News September 27, 2024

కృష్ణా: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తాడిగడపలో బస్సును ఓవర్టేక్ చేయబోయి స్కిడ్ అయ్యి పడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు తాడిగడపకు చెందిన అశోక్(23)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 27, 2024

వెంకటరెడ్డికి OCT 10 వరకు రిమాండ్ విధింపు

image

గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. గనుల కేటాయింపులలో వెంకటరెడ్డి పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వెంకటరెడ్డిని A1గా అధికారులు చేర్చారు. కాగా గత రాత్రి హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడ GGHలో వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.

News September 27, 2024

నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లను మార్చండి: మంత్రి

image

నూజివీడు IIIT అధికారులతో మంత్రి పార్థసారథి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆహార నాణ్యతను పెంచాలన్నారు. ఆహార వస్తువులు, నాణ్యతను చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చాలని ఆదేశించారు.

News September 27, 2024

కృష్ణా: పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

పండుగల సందర్భంగా విజయవాడ మీదుగా MGR చెన్నై సెంట్రల్(MAS), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02841 SHM- MAS ట్రైన్‌ను ఈ నెల 30 నుంచి నవంబర్ 18 వరకు ప్రతి సోమవారం, నం.02842 MAS-SHM ట్రైన్‌ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20వరకు ప్రతి బుధవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు విజయనగరం, రాజమండ్రి, గూడూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 27, 2024

మీ ఆలోచ‌న‌లు, స‌ల‌హాల‌ను పంచుకోండి: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర 2047మిష‌న్‌లో ప్రజలంతా భాగ‌స్వాములు కావాలని కలెక్టర్ జి. సృజన పిలుపునిచ్చారు. https://swarnandhra.ap.gov.in/suggestions అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ విజన్ కోసం తమ ఆలోచ‌న‌లు, స‌ల‌హాల‌ను పంచుకోవాలని ఆమె కోరారు. ఈ వెబ్‌సైట్‌లో ఆయా అంశాలపై సలహాలు ఇవ్వాలని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News September 27, 2024

కృష్ణా: రాజమండ్రి మెము స్పెషల్ రైలు రద్దు

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ-రాజమండ్రి మెము స్పెషల్ రైలును ఈ నెల 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30న విజయవాడ-రాజమండ్రి మెము రైలు(నం.07768) రద్దు చేసిన విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.