Krishna

News January 27, 2026

కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్షించారు. నిర్మాణాల వేగవంతానికి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 121 గృహాలు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాలలో 719 గృహాలు BBL దశలో, 2770 గృహాలు BL దశలో, 119 గృహాలు RC దశలో ఉన్నాయన్నారు.

News January 27, 2026

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

News January 27, 2026

మాతృ మరణాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు.

News January 27, 2026

పొగమంచు వల్ల అపరాల సాగు రైతుకు నష్టమే..!

image

కృష్ణాజిల్లాలో పొగమంచు ప్రభావంతో అపరాల సాగు రైతులు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో సూర్యరశ్మి పంటపై పడకపోవడం వల్ల ఆకులపై తేమ పెరిగి ఫంగస్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. దీని కారణంగా అపరాల మొక్కల ఎదుగుదల లోపించి, పూత–గింజ దశలో ఉన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతుకు నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు

News January 27, 2026

అపూర్వ సహోదరులు.. పోలీస్ విభాగానికి గర్వకారణం

image

కృష్ణ జిల్లా పోలీస్ విభాగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. H.జంక్షన్ SI వి.సురేష్, పామర్రు CI. వి.సుభాకర్ స్వయాన అన్నదమ్ములు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఇద్దరూ ఒకే వేదికపై ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు హోదాల్లో ఒకే సందర్భంలో పురస్కారాలు అందుకోవడం పోలీస్ విభాగానికి గర్వకారణం.

News January 27, 2026

వచ్చే నెల 7న ఉయ్యూరు వీరమ్మ తల్లి సిడి బండి ఉత్సవం!

image

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో 11వ రోజును ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజున సిడి బండి ఉత్సవంగా ఫిబ్రవరి 7న జరగనుంది. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడిని సిడి బండిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అదే టైంలో ఆ యువకుడిని అరటిపండులతో కొట్టడం సంప్రదాయం. ఆ ఒక్క రోజే లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా. మరి మీరు వెళుతున్నారా కామెంట్ చేయండి.

News January 27, 2026

చారిత్రక వైభవం.. ఉయ్యూరు వీరమ్మ తల్లి ఉత్సవం!

image

ఐదు శతాబ్దాల చరిత్ర గల ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో ప్రారంభమవుతున్నాయి. పెదకడియంలో జన్మించిన వీరమ్మ, భర్త మరణానంతరం సహగమనం చేసిన మహాసాధ్వి. మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ‘ఉయ్యాల ఊయింపు’ ఘట్టం అత్యంత ప్రత్యేకం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ తిరునాళ్లలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News January 27, 2026

కృష్ణా: విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి

image

జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో విద్యా శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రెండవ బహుమతిని చేనేత, జౌళి శాఖ, సాంఘిక, పరిశ్రమల శాఖ సంయుక్తంగా ప్రదర్శించిన శకటానికి దక్కగా, మూడవ బహుమతిని DRDA శకటానికి దక్కింది. ఆయా శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.

News January 26, 2026

విశాఖలో కృష్ణా జిల్లా విద్యార్థి అనుమానాస్పద మృతి

image

అవనిగడ్డ ప్రాంతానికి చెందిన AU MCA ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి విశాఖ నగరంలోని రేసవానిపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహం కుళ్లి, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం పోలీసులు తలుపులు తెరిచి పరిశీలించగా ఘటన వెలుగులోకి వచ్చింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 25, 2026

అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.