India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్థుల నుంచి ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు ఒకచోట పోగుచేసి వాటిని పంచాయతీ వాహనాల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాలన్నారు.
కృష్ణాజిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జిల్లాలోని రెండు మండలాలకు హైఅలర్ట్ ప్రకటించింది. ఉంగుటూరు 42.3 డిగ్రీలు, ఉయ్యూరు 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండనున్నట్లు తెలిపింది. మిగిలిన చోట్ల 32 డిగ్రీలకు పైగా ఉండనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛఆంధ్ర @ 2047 గోడపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ముందడుగు వేస్తోందన్నారు.
కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు ఒకచోట పోగుచేసి వాటిని పంచాయతీ వాహనాల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాలన్నారు.
అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు.
నాగాయలంకలోని జలక్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను పునః ప్రారంభించారు. సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. జలక్రీడలపై నాగాయలంక అనువైన ప్రదేశమన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఈ ప్రాంతం వాసి కావటంతో భవిష్యత్తులో నాగాయలంకకు దేశంలోనే గొప్ప ప్రఖ్యాతులు రానున్నాయని ఆశించారు.
జిల్లాలో మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరంలో మొదలై 2023-24 సంవత్సరంతో ముగుస్తోందన్నారు.
అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వెలుగు చూసింది. ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తప్పుడు బిల్లులతో రూ.1.58 కోట్లు మళ్లించినట్లు గుర్తించి సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. అలాగే, అవినీతిని గుర్తించలేకపోయిన ఎస్టిఓ ఆదిశేషుపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.
మాస్టర్స్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ లెవెల్ క్రీడల్లో గూడూరు పాఠశాల ఉపాధ్యాయిని మత్తి అరుణ తన అసామాన్య ప్రతిభను చాటారు. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో 4×400 మీటర్స్ రన్నింగ్లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్, 4×100 మీటర్స్ రన్నింగ్లో సిల్వర్ మెడల్ను కైవసం చేసుకొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పేరు జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశారని తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.
శిశు గృహాల్లో ఉంటున్న అనాధ పిల్లలను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) పోర్టల్ ద్వారా దత్తత తీసుకునేందుకు వీలుగా అందులో పిల్లల వివరాలను అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డీఈఓ ఎం.జె రామారావు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.