India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణాజిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న జిల్లా సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ స్టేడియంలో ఉదయం 7 గంటలకు ఈ ఎంపికలు జరుగుతాయని అసోసియేషన్ కార్యదర్శి డి. దిలీప్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.

☞ మచిలీపట్నంలో మహిళ చెయ్యి నరికిన వ్యక్తి
☞ పదవుల ఆశించిన వారికి న్యాయం చేస్తాం: పెడన ఎమ్మెల్యే
☞ మచిలీపట్నంలో బార్ లైసెన్సులకు లక్కీ డ్రా
☞ కృష్ణా జిల్లాలో పలుచోట్ల వినాయక నిమజ్జనాలు
☞ పెడన మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం
☞ బుడమేరు వరదలకు ఏడాది పూర్తి..!
☞ నాగాయలంక వద్ద తగ్గు ముఖం పట్టిన వరద

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు మంజూరు చేయాలని తీర్మానించారు.

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం
☞ తోట్లవల్లూరులో వృద్ధ దంపతులపై హిజ్రాల దాడి
☞ కృష్ణా: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ
☞ కృష్ణాలో వర్క్ ఫ్రం హోం కోసం సర్వే
☞ కృష్ణా: DSC డీఎస్సీ 95% అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి
☞ విజయవాడలో డ్రగ్స్ తో పట్టుబడ్డ ప్రేమికులు

కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఈ ఏడాది గణేష్ నవరాత్రుల నిమజ్జనానికి డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేసింది. డీజేలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత సాంప్రదాయ వాద్యకారులైన డప్పు కళాకారులు క్రమంగా కనుమరుగైపోతున్నారు. ఒకప్పుడు వీరు బృందాలుగా తమ కళను ప్రదర్శిస్తే అక్కడి నుంచి ఒక్కరు కదలని స్థితి ఉండేది. ఈ ఏడాది డీజేలకు నిషేధం విధించిన నేపథ్యంలో, మళ్లీ ఈ సాంప్రదాయ కళాకారులకు అవకాశాలు వస్తాయా?.

జిల్లాలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో GST అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో వస్తు సేవల పన్నుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఆడిట్ పేరాల వివరాలను సంబంధిత ఆడిటర్ అధికారి వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు.

మెగా డీఎస్సీలో అర్హత సాధించిన కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో జరిగింది. 1048 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ఈ తనిఖీ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఎంఈఓ, రెవెన్యూ శాఖల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు
☞ కృష్ణా జిల్లాలో వర్షానికి నష్టపోయిన చిరు వ్యాపారులు
☞ హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
☞ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు
☞ ఈనెల 30ను గుడివాడలో జాబ్ మేళా

☞ పేర్ని నానిపై ఏలూరు పోలీసుల కేసు నమోదు
☞ మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై కలెక్టర్ వర్క్ షాప్
☞ కృష్ణా జిల్లాలో వేగవంతంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
☞ మచిలీపట్నం- నరసాపురం జాతీయ రహదారిపై ప్రమాదం
☞ అవనిగడ్డ: పడవలో మృతదేహం
☞ మచిలీపట్నంలో జనసేన నేత సస్పెండ్

వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై జరిగే సర్వే గురించి సంపూర్ణ అవగాహన కలిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై కార్యశాల నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే DPIIT అవుట్ రీచ్ సర్వే గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో PPT ద్వారా లోతుగా వివరించారు.
Sorry, no posts matched your criteria.