Krishna

News February 18, 2025

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News February 18, 2025

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

News February 17, 2025

గన్నవరం: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

News February 17, 2025

తోట్లవల్లూరు: ‘రేడియం స్టిక్కర్లు లేక ప్రమాదాలు’

image

తోట్లవల్లూరుల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ మీద వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందారు. ఎడ్ల బండ్లకు వెనుక రేడియం స్టిక్కర్స్ అంటించకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 16, 2025

తోట్లవల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

తోట్లవల్లూరు మండలం యాకమూరు రైస్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై వస్తున్న ఆర్టీసీ కండక్టర్ చీకుర్తి సురేష్ (47) వెనుక వైపు నుంచి ఎడ్ల బండిని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 16, 2025

కంకిపాడు: వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడులో ఉంటున్న వెంకటస్వామి ఈనెల 14న రాత్రి వాకింగ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య కొందరితో కలిసి సాయంత్రం వెతకగా రోడ్డు పక్కన చనిపోయి కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

News February 16, 2025

MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం : DRO

image

పట్టభద్రుల MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం అని కృష్ణాజిల్లా సహాయ ఎన్నికల అధికారి, DRO కె చంద్రశేఖరరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన వారికి శనివారం కలెక్టరేట్‌లో వారి విధులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.

News February 15, 2025

పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News February 15, 2025

గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

image

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

News February 14, 2025

వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

image

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు. 

error: Content is protected !!