Krishna

News February 25, 2025

కంచికచర్ల: ప్రమాదంలో ఇద్దరి మృతి.. వివరాలివే..!

image

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద బైకు అదుపు తప్పి డి వైడర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు ఉయ్యూరు ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), కరిముల్లా(30),లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఉయ్యూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News February 25, 2025

విజయవాడ : వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

image

వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ భారతి నగర్‌లోని ఇటీవల ఓ బాడీ మసాజ్ సెంటర్లో వైసీపీ ఎస్టీ సంఘం నేత వడిత్య శంకర్ నాయక్ దొరికారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

News February 25, 2025

ఉంగుటూరు : వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్

image

ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం.. మండలంలోని గ్రామానికి చెందిన వివాహిత పెళ్లి వేడుక నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో కలపాల కిరణ్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

News February 25, 2025

కృష్ణా : గ్యాస్ ఏజెన్సీలకు డీఎస్ఓ హెచ్చరిక

image

దీపం-2 ప‌థ‌కం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌కు అద‌నంగా నగదు వ‌సూలు చేసినట్లు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు ర‌ద్దు చేస్తామని కృష్ణాజిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి హెచ్చరించారు. దీపం-2 ప‌థ‌కం అమ‌లు, ఐవీఆర్ఎస్ స‌ర్వే నివేదిక‌లు, ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్య‌లపై సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌ మీటింగ్ హాలులో స‌మావేశం నిర్వహించారు.

News February 25, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణ: 48 గంటలు మద్యం దుకాణాల బంద్ * కంకిపాడులో దారి దోపిడీ ముఠా అరెస్ట్ * కృష్ణా: ధ్రువీకరించని యాప్‌స్‌తో జాగ్రత్త: SP * బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే * విజయవాడ: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి * కృష్ణా: PDF అభ్యర్థికి జగన్ మద్దతు * శివరాత్రికి సిద్ధమవుతున్న యనమలకుదురు * గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ముగ్గురి అరెస్ట్

News February 24, 2025

కృష్ణా జిల్లాలో 48 గంటలు మద్యం దుకాణాలు బంద్

image

కృష్ణా జిల్లాలో ఈ నెల 27వ తేదీన MLC ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాలో మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీన సాయంత్రం 4 వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసి వేయాలన్నారు. ఉత్తర్వులను బేఖాతరు చేస్తే సంబంధిత మద్యం దుకాణాల లైసెన్స్‌లు రద్దువతాయని హెచ్చరించారు.

News February 24, 2025

ధ్రువీకరించని లోన్ యాప్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

image

ధ్రువీకరించని లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఆర్. గంగాధర్ ప్రకటనలో తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోయినా, సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఇస్తామంటూ ఆకర్షిస్తారు. వ్యక్తిగత సమాచారం దోచేసి తిరిగి మిమ్మల్ని బెదిరించి మీ వద్ద నుంచి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారని అన్నారు. సైబర్ నేరానికి గురైనప్పుడు 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 

News February 24, 2025

బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే.! 

image

పోలవరం కాలువలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. కోడూరుపాడుకు చెందిన సుభానీ, జానీ కుమారులు నాగూర్ బాషా, షరీఫ్, సుభానీతో కలిసి చేపలకు వేటకు వెళ్లారు. చేపల గాలం చిక్కుకుపోవడంతో దాన్ని తీసేందుకు నాగూర్ బాషా వెళ్లగా, మునిగిపోతున్న సమయంలో పైకి లాగేందుకు షేక్ షరీఫ్ చెయ్యి ఇవ్వగా ఇద్దరు మునిగిపోయారు. బయటకు తీసేందుకు ప్రయత్నించినా అప్పటికే ప్రాణాలు విడిచారు.

News February 24, 2025

MTM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరపైకి వైసీపీ

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు తాము పోటీలో ఉండమని చెప్పి వైసీపీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల తెరపైకి వచ్చింది. పార్టీపరంగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా PDF అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ MLC KS లక్ష్మణరావుకు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. కూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.

News February 24, 2025

క‌ృష్ణా: 25న జిల్లా సబ్ జూనియర్ ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

image

వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్-14 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ బాబు తెలిపారు. ఈ ఎంపికలు ఈ నెల 25న మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు FAI గుర్తింపు కార్డు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.