India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వల్లభనేని వంశీ అరెస్ట్ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అదే పార్టీకి చెందిన కొందరు వైసీపీ నాయకులపై కూడా కేసులో ఉన్నాయి. వీరిని కూడా ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనే సూత్రధారుడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పేర్ని నాని బియ్యం మాయం కేసులో బెయిల్పై ఉన్నారు.
జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
* కృష్ణలంక పీఎస్లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు* కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్న పోలీసులు* వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చే అవకాశం* కృష్ణలంక పీఎస్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య* వల్లభనేని వంశీని కలిసేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు* విశాఖ నుంచి పటమట పీఎస్కు సత్యవర్థన్ను తీసుకొచ్చిన పోలీసులు
జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైసీపీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేయటంతోపాటు జిల్లా అంతటా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ – 30ని అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ఎటువంటి నిరసనలు, ఆందోళనలకు తావులేకుండా నిషేదాజ్ఞలు జారీ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్- 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
మచిలీపట్నంలోని ఓ టీ దుకాణదారుడిపై కలెక్టర్ డీకే బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పారిశుద్ధ్య చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ గురువారం ఉదయం స్థానిక మూడు స్థంభాల సెంటర్లో పర్యటించారు. సర్వీస్ రోడ్డులో ఉన్న ఓ టీ దుకాణం ముందు తాగేసిన టీ గ్లాసులు ఎడాపెడా పడేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆ దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డస్ట్ బిన్లో వేయించడం తెలియదా.?’ అంటూ ఫైర్ అయ్యారు.
టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నెల 27న MLC ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా నియమితులైన వారు బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. బుధవారం జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.