India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1. MLC ఓటు చెక్ చేసుకోండి ఇలా. 2. గన్నవరం: బాలికల మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు3. మచిలీపట్నం బ్యాంకులో దొంగతనం4. మచిలీపట్నం: ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ తొలగింపు5. గుడివాడ: విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి 6. M.Tech 1st సెమిస్టర్ టైం టేబుల్ విడుదల 7. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీకి షాక్8. జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం9. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల పరిశీలన
కలెక్టర్ డీకే బాలాజీ గుడివాడలోని ఏజీకే మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో పాఠ్యాంశాలు వారి అభిరుచులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘నాకు సాధ్యమే’ కార్యక్రమం ద్వారా బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహోన్నత వ్యక్తుల గాధలను అర్థం చేసుకొని వారిని మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీలో ఎంటెక్ (2024 రెగ్యులేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయవలసిన మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలయ్యింది. ఈనెల 24,25, 27, 28 మార్చ్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షల నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్ కోసం https//kru.ac.in// వెబ్ సైట్లో చూడాలని సూచించింది.
గన్నవరం (M) ముస్తాబాద్లో నలుగురు బాలికలు అదృశ్యం అయ్యారు. విజయవాడలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు కాలేజీకి వెళ్లకుండా షాపింగ్ మాల్కి వెళ్లారు. యాజమాన్యం, తల్లిదండ్రులు మందలించడంతో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నలుగురిని పిడుగురాళ్లలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. దీంతో పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. జైలులో వంశీకి అందిస్తున్న వివరాలను సమర్పించాలని జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జైలర్ వివరాల ప్రకారం తీర్పు ప్రకటిస్తామని న్యాయమూర్తి గురువారానికి కేసు వాయిదా వేశారు
పామర్రు మండలం పెదమద్దాలికి చెందిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన బాలికను యువకుడు వేణు వేధిస్తున్నట్లు మంగళవారం బాలిక తల్లి పామర్రు పీఎస్లో ఫిర్యాదు చేసింది. అతడిని పలుమార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోలేదని ఆమె చెప్పినట్లు వివరించారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.
రెడ్ బుక్ గురించి తనకు తెలియదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాం. మా ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు యాక్టివ్గా ఉండి ఏం చేయాలి’ అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. వంశీ అరెస్ట్ లాంటివి చిన్న చిన్న విషయాలని అన్నారు.
జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.