Krishna

News August 13, 2024

కృష్ణా: ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు మార్గదర్శకాలు విడుదల

image

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు కౌన్సిలింగ్‌కు అవసరమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నెల 15 వరకు ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరణకు అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ మేరకు మండల స్థాయి కౌన్సెలింగ్‌‌ను ఈ నెల 17కి వాయిదా వేశామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

News August 13, 2024

ఎన్టీఆర్: రెవెన్యూ సదస్సులపై కలెక్టర్ కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ సృజన తెలిపారు. మొత్తం 45 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయని, ఈ సదస్సులో స్వీకరించిన ప్రతి అర్జీకి రిజిస్టర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సదస్సులపై ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు సంబంధిత అధికారులు సమీక్షలు నిర్వహిస్తారని, నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News August 13, 2024

విజయవాడలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు

image

కండ్రికకు చెందిన ఓ బాలిక(17)అదృశ్యమైన ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు తన ఫ్రెండ్ ఇంటికెళ్లి వస్తానని చెప్పిన సదరు బాలిక సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని బాలిక తండ్రి పోలీసులకు చేశారు. బాలిక అదృశ్యమైన ఘటనపై ప్రమోద్ అనే యువకుడి హస్తముందని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నున్న పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

News August 13, 2024

గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రాను మారుస్తాం: డీజీపీ 

image

కృష్ణా: గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రాను మారుస్తామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సోమవారం ఆయన పలు జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. 

News August 13, 2024

వారి వివరాలు సేకరించండి: చంద్రబాబు

image

కృష్ణా: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల వివరాలు మండలాలవారీగా సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కిడ్నీ సమస్యలకు కారణాలు, కిడ్నీ రోగులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నీటిపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాగా జిల్లాలోని ఏ.కొండూరు తదితర ప్రాంతాల్లో సైతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.

News August 12, 2024

వేల కోట్ల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారు: దేవినేని ఉమ

image

ఎన్టీఆర్: వైసీపీ పాలకులు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.16,483 కోట్లు ఇస్తే, జగన్ తన అసమర్థతతో 20% కూడా ఖర్చు పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన తాగునీరు ఇవ్వకుండానే జగన్ తన అవినీతితో అస్మదీయుల జేబులు నింపారని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News August 12, 2024

దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీపడాలి: చంద్రబాబు

image

పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.

News August 12, 2024

విజయవాడ: డ్రగ్స్ కేసులో నిందితుడి అరెస్ట్

image

గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయి అనే యువకుడిని డ్రగ్స్ కేసులో విజయవాడ సెబ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడు డిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విజయవాడ పశ్చిమ సెబ్ పోలీసులు గుంటూరు వచ్చినట్లు తెలియటంతో సెబ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News August 12, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 14,15న విజయవాడ మీదుగా నాందేడ్(NED), శ్రీకాకుళం(CHE) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07487 ఆగస్టు 14న NED-CHE, 15న CHE- NED మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. ఏపీలో ఈ రైళ్లు విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News August 12, 2024

మాజీ MLA పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫు లాయర్ అశ్వినీకుమార్ సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.