Krishna

News February 4, 2025

గుడివాడ: లారీ ఢీకొని వ్యక్తి గుర్తుతెలియని మృతి

image

గుడివాడ మార్కెట్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్‌లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 4, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12, 14, 17, 19 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News February 4, 2025

గన్నవరం: ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

image

గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు… సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

News February 4, 2025

ఆ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో SC, ST కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పౌర హక్కుల రక్షణ, అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును కమిటీ సభ్యులతో చర్చించారు.

News February 3, 2025

చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

image

0-5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 38 వేల వరకు పెండింగ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

News February 3, 2025

కంకిపాడుకి చెందిన బాలుడిపై కేసు నమోదు

image

కంకిపాడుకి చెందిన బాలుడిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. గుంటుపల్లికి చెందిన ఓ బాలిక కంకిపాడుకు చెందిన బాలుడిని ప్రేమించింది. ఈ క్రమంలో లైంగికంగా కలిసినట్లు బాలిక ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాలుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News February 3, 2025

విజయవాడ: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025

News February 3, 2025

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

image

మచిలీపట్నం-పెడన హైవేలో హర్ష కాలేజ్ సమీపంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News February 2, 2025

మచిలీపట్నంలో ప్రమాదానికి గురైన నరసాపురం MLA కారు

image

మచిలీపట్నం-పెడన హైవేలో హర్ష కాలేజ్ సమీపంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

News February 2, 2025

కృష్ణా: ఎన్నికల నిర్వహణకు నిస్పక్షపాతంగా సహకరించాలి- కలెక్టర్

image

ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లను నిస్పక్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ కోరారు. శ‌నివారం కలెక్టరేట్‌లో ఆయన తన ఛాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ నిర్వహణపై వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

error: Content is protected !!