Krishna

News August 9, 2024

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టీవీఎస్ మోపెడ్‌ను వేగంగా వచ్చిన ఓ పల్సర్ బైక్ ఢీకొట్టింది. పల్సర్ బైక్‌పై వెనుక కూర్చున్న యువతికి ఫ్లై ఓవర్ గోడ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యంలో హారికదేవి(20) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యువతి స్వగృహం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంగా గుర్తించారు. 

News August 9, 2024

కృష్ణా: పదవుల పందేరంలో ఎవరు విజేతలయ్యేనో

image

నామినేటెడ్ పదవుల భర్తీకై సీఎం చంద్రబాబు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆశావహులు పదవుల కోసం క్యూ కడుతున్నారు. పలు కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఊహాగానాలు వచ్చినందున ఆ పదవులు దక్కించుకునేందుకు అనేకమంది ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని 16 ఎమ్మెల్యేలు, 2ఎంపీ స్థానాలు టీడీపీ కూటమి దక్కించుకున్నందున నామినేటెడ్, ఇతర పదవుల ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.

News August 9, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ మీదుగా గుంటూరు-సికింద్రాబాద్(నం.12706&12705) మధ్య ప్రయాణించే ఇంటర్‌ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు నెక్కొండ స్టేషన్‌లో స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా ఈ స్టేషన్‌లో ఇచ్చిన స్టాప్‌ను కొనసాగిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

News August 9, 2024

కృష్ణా: పీజీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్&సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 24 మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 9, 2024

ఆగష్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం: కలెక్టర్ సృజన

image

ఆగష్టు 15వ తేదీ నుంచి నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. విజయవాడలో అన్న క్యాంటీన్లను శుక్రవారం కలెక్టర్ సృజన, నగరపాలక సంస్థ కమీషనర్ ధ్యానచంద్ర, ఆర్డీవో భవానీ శంకరీలతో కలిసి కలెక్టర్ స్వయంగా పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News August 9, 2024

పంచాయతీలకు నిధులు పెంపు: డిప్యూటీ సీఎం పవన్

image

ఆగష్టు 15న వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.

News August 9, 2024

విజయవాడ: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం(ERS), పాట్నా(PNBE) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06085 ERS-PNBE ట్రైన్‌ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రతి శుక్రవారం, నం.06086 PNBE-ERS ట్రైన్‌ను ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయంది. 

News August 9, 2024

చిన్నారుల పాలిట రియల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వందలాది మంది చిన్నారులకు మహేశ్ బాబు పునర్జన్మనిచ్చారు. విజయవాడలోని ఒక ప్రముఖ ఆసుపత్రి సహకారంతో ఆయన నిర్వహిస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ చిన్నారులకు విజయవంతంగా హృదయ సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించింది. నేడు మహేశ్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు ఆయన అందజేసిన సేవాకార్యక్రమాలను జిల్లావాసులు కొనియాడుతున్నారు.

News August 9, 2024

కృష్ణా నదికి వరద ఎఫెక్ట్.. భవానీ ద్వీపం మూసివేత

image

కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక శాఖ అధికారులు గురువారం మూసివేశారు. డబుల్ డెక్ క్రూయిజర్, ఇతర బోట్లను తీరంలో నిలిపేసిన అధికారులు బోటింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున భవానీ ద్వీపంలో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని ఏపీటీడీసీ అధికారులు చెప్పారు.

News August 9, 2024

నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు

image

విజయవాడకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారని కలెక్టర్ సృజన తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు అవుతారని తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కలెక్టర్ సృజన డీసీపీ చక్రవర్తి తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.