Krishna

News August 5, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఎం.ఫార్మసీ, బీ.ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ(One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఆయా కోర్సుల విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

News August 4, 2024

కృష్ణా: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) మూడేళ్ల డిప్యుటేషన్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన అర్హులైన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని CRDA వెల్లడించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలకై https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News August 4, 2024

కృష్ణా జిల్లాలో భారీగా ఎస్ఐలు బదిలీలు

image

కృష్ణా జిల్లాలో భారీ మొత్తంలో ఎస్ఐలను బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. జిల్లాలోని 23 మంది ఎస్ఐలకు స్థానం చలనం కల్పించారు. అలాగే వీఆర్‌లో ఉన్న ఎస్ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనుకూలంగా పనిచేసిన వారికి వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

News August 4, 2024

తాడేపల్లిలో యువతిపై ప్రేమోన్మాది దాడి

image

తాడేపల్లి ఎయిమ్స్ రోడ్డు వద్ద ఆదివారం ఓ ప్రేమోన్మాది నర్సుగా పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన కావ్యపై బ్లేడ్‌తో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విజయవాడకు చెందిన క్రాంతిగా గుర్తించారు.

News August 4, 2024

గిరిజన విద్యార్థుల కోసం డీఎస్సీ ఉచిత కోచింగ్ర్: కలెక్టర్

image

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అర్హులైన గిరిజన విద్యార్థుల కోసం డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని దీన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లాలో 30వ తేదిన గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలన్నారు.

News August 4, 2024

జి. కొండూరులో వివాహిత ఆత్మహత్య

image

జి. కొండూరులో ఓ వివాహిత(23)ఇంట్లో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. CI కిషోర్ మాట్లాడుతూ.. జి.కొండూరుకి చెందిన సాంబయ్య, కవిత పెద్దల సమక్షంలో 5ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సాంబయ్య పుట్టింటి వారితో మాట్లాడవద్దని వాదించేవాడు. ఈ క్రమంలో కవిత తండ్రి శ్రీను మనువడు, మరవరాలికి చిరుతిండి కొనివ్వడంతో సాంబయ్య చూసి గొడపడగా మనస్తాపం చెందిన కవిత ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని కనిపించందన్నారు.

News August 4, 2024

ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ తొలగించబడింది

image

నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12787, 12788 ట్రైన్‌లను ఆగస్టు 3 -10 వరకు విజయవాడ మీదుగా కాక రామవరప్పాడు- రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ లేదని, సమీపంలోని రామవరప్పాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు.

News August 3, 2024

కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో ఏప్రిల్-2024లో జరిగిన M.Sc. నానో టెక్నాలజీ 2, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ANU వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examcell/results చూడాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 3, 2024

కృష్ణా: ‘గోకులం పథకానికి దరఖాస్తు చేసుకోండి’

image

ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు, జీవాలకు షెడ్లు నిర్మించుకునే వారికి గోకులం పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలను కునేవారు జాబ్ కార్డుతో ఉపాధి హామీ కార్యాలయంలో లేదా స్థానిక గోపాలమిత్రలు, పశువైద్య సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ పథకంలో షెడ్ నిర్మాణ వ్యయంలో పశుపోషకులకు 90%, జీవాలు, కోళ్లు పెంచేవారికి 70% రాయితీ ఇస్తామన్నారు.

News August 3, 2024

చిన్నారులను వేధించడంలో కృష్ణా జిల్లా టాప్

image

గత ఐదేళ్లలో రాష్ట్రంలో నమోదైన పోక్సో కేసులలో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు పార్లమెంటులో సంబంధిత మంత్రి వివరాలు వెల్లడించారు. ఏపీలో గత ఐదేళ్లలో 6,927 పోక్సో కేసులు నమోదవగా కృష్ణాలో అత్యధికంగా 1,214 కేసులో నమోదయ్యాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బదులిచ్చారు. 6,927 కేసులలో 134(1.93%) మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని మంత్రి చెప్పారు.