India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థిని వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో సొమ్ము చేసుకుంటున్న ఇద్దిరిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ తెలిపారు. నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో సోయల్ పరిచయమయ్యాడు. ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి, కొత్త నంబర్లతో పంపుతూ వేధించేవాడు. ఆ వీడియోలు చూసేందుకు సోయల్ నుంచి క్యూఆర్ కొనుగోలు చేసిన నందికొట్కూరుకు చెందిన రఘును కూడా అరెస్టు చేశారు.
వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని, పనులు కల్పించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ భాషా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉపాధి హామీ పథకం అమలు, హౌసింగ్ అంశాలపై అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పనుల కోసం కూలీలు వలస వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పించాలని అధికారులను ఆదేశించారు.
➤ కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదు. ➤ ఎమ్మిగనూరులో మహిళా దొంగల హల్ చల్. ➤ ఈ నెల 23న గ్రూప్-2 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ. ➤ తుగ్గలి వద్ద బస్సు బోల్తా. ➤ పెద్దకడబూరు: నకిలీ ఇల్లు పట్టాలు.. వ్యక్తిపై కేసు. ➤ జగన్కు Z+ భద్రత కల్పించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్. ➤ గ్రూప్-2 అభ్యర్థుల కోసం 08518-277305 హెల్ప్ డెస్క్ నంబర్. ➤ ఏపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా వరుణ్.
గ్రూప్-2 అభ్యర్థుల సౌలభ్యం కోసం కర్నూలు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూల్ కలెక్టరేట్లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు టోల్ ఫ్రీ 08518-277305 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
☞ కాళ్లు, చేతులలో మంట, <<15529133>>తిమ్మిర్లుగా<<>> అనిపించడం
☞ నరాల బలహీనత, కండరాల నొప్పులు
☞ సరిగ్గా నడవలేకపోవడం, తూలడం వంటి లక్షణాలు
☞ నోరు వంకర పోయి మింగలేక ఇబ్బంది పడే పరిస్థతి
☞ చెమటలు ఎక్కువగా పట్టడం
☞ వ్యాధి తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
కర్నూలులో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. నగరంలోని భగత్సింగ్నగర్కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు నంద్యాల నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు రేణిగుంటకు చేరుకునేది. నేటి నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంటలో మధ్యాహ్నం 1:50కి బయలుదేరి, నంద్యాలకు రాత్రి 8:40 గంటలకు చేరుకుంటుంది. నిర్వహణపరమైన కారణాల వల్ల మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ-శ్రమ్ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ అంశంపై కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, మత్స్య శాఖతో పాటు ఇతర శాఖలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం జరిగిన టెలి కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. 69 సెంటర్లలో 23,098 మంది ఫస్ట్ ఇయర్, 22,227 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అమరావతి ఫ్రీ జోన్గా ప్రకటించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులోని సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ఏర్పాటయ్యే పరిశ్రమలలో స్థానిక యువతకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో తేవాలని కోరారు. జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.