India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కలెక్టరేట్ నుంచి జేసీ నూరుల్ ఖమర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, రెవెన్యూ, ప్రజాభిప్రాయం వంటి అంశాలపై సమీక్షించిన జేసీ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సూచించారు.

కలెక్టరేట్ నుంచి జేసీ నూరుల్ ఖమర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, రెవెన్యూ, ప్రజాభిప్రాయం వంటి అంశాలపై సమీక్షించిన జేసీ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సూచించారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం, ఆస్తి వివాదాలు, లోన్ మోసాలు, కుటుంబ సమస్యలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 157 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 12,967 మంది విద్యార్థులకు గానూ 12,810 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ఈనెల 9న ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమస్త ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు.

అనుమానాస్పద లోన్ యాప్లను డౌన్లోడ్ చేయవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను కోరారు. తక్కువ సమయంలోనే లోన్లు ఇస్తామని సోషల్ మీడియా, మెసేజ్ల ద్వారా వచ్చే ప్రలోభాలకు గురికావద్దని హెచ్చరించారు. లోన్ అవసరమైతే కేవలం గుర్తింపు పొందిన బ్యాంకులు మాత్రమే సంప్రదించాలన్నారు. ఎవరైనా యాప్ల ద్వారా వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడితే వెంటనే 1930 నంబర్కు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 870 మంది వ్యక్తులు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయగా, ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. 1000 లీటర్ల బెల్లం ఊట, 300 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 870 మంది వ్యక్తులు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయగా, ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. 1000 లీటర్ల బెల్లం ఊట, 300 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 870 మంది వ్యక్తులు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయగా, ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. 1000 లీటర్ల బెల్లం ఊట, 300 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.
Sorry, no posts matched your criteria.