Kurnool

News March 13, 2026

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రముఖులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ విక్రాంత్ హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పోస్టులు చేస్తే గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.

News March 13, 2026

పరీక్షలకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు: డీఈవో

image

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే 10వ తరగతి పరీక్షలకు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. విద్యార్థులు గానీ వారి తల్లిదండ్రులు గానీ ఏదైనా అత్యవసరం ఉంటే
బాలాజీ 9000822394, శ్రీనివాసులు 8639353678 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

News March 13, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 180 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 16,116 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 12, 2026

జగన్ విమర్శలు దొంగే దొంగ అన్నట్లున్నాయి: ఆది కృష్ణమ్మ

image

కూటమి ప్రభుత్వంపై YCP అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లున్నాయనిని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. కర్నూలులో ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.

News March 12, 2026

ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

image

కర్నూలు జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

News March 12, 2026

కర్నూలు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు

image

కర్నూలు జిల్లాలో 2025-26 రబీ సీజన్ పంటల నమోదు ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. రైతు సేవా కేంద్రాల వారీగా వివరాలు అందుబాటులో ఉంచమని రైతులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా రైతు సేవా కేంద్రాల్లో తెలియజేయాలన్నారు. అభ్యంతరాలకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.

News March 12, 2026

కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News March 12, 2026

కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

image

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.

News March 12, 2026

కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

image

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.

News March 12, 2026

ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

image

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.