Kurnool

News September 22, 2025

కర్నూలు జిల్లా ఎస్పీ పబ్లిక్ గ్రీవెన్స్‌లో 65 ఫిర్యాదులు

image

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించి ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా విని పరిష్కార చర్యలకు ఆదేశించారు. మోసాలు, ఉద్యోగ మభ్యపాటు, అప్పుల వేధింపులు, స్కూల్‌లో ఘర్షణలు, భూ ఆక్రమణలు, పొదుపు గ్రూపుల మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.

News September 22, 2025

ఎమ్మిగనూరు: పెన్షన్ ఇచ్చి మమ్మల్ని బ్రతికించండి అయ్యా.!

image

మండల పరిధిలోని దైవందీన్నేలో సంవత్సరం క్రితం తన తండ్రి మరణించాడని, తల్లికి పింఛన్ ఇవ్వాలని 14 సం. సంకటి ప్రసన్న ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ కూడా పక్షవాతంతో కొట్టుమిట్టలాడుతుందని, తమకు ఆస్తిపాస్తులు ఏమీ లేవని వాపోయాడు. ఆమ్మకు కావాల్సిన మందుల కోసం చదువు మానేసి కూలి పనులు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి బాలుడి అమ్మకు చికిత్స అందించి, పింఛన్ ఇప్పించాలని కోరుతున్నాడు.

News September 22, 2025

జాతీయ అవార్డు పొందిన సమీరా

image

తుగ్గలి మండలంలోని గుండాల తండాకు చెందిన ట్రాన్స్‌జెండర్ సమీరా చెక్కభజన కళారంగంలో ప్రతిభ కనబరిచి జాతీయ అవార్డు పొందారు. ఆదివారం ఢిల్లీలో హర్యానా ఆర్థిక మంత్రి రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం ఎంతో సంతోషం కలిగించిందని సమీరా తెలిపారు. ప్రజలు అభినందనలు తెలిపారు.

News September 22, 2025

రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో కర్నూలుకు 3 పతకాలు

image

గుంటూరులో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-14 వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో కర్నూలు క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. 79 కేజీల విభాగంలో ఆఫ్రిది బంగారు పతకం సాధించగా ఫైజాన్, ఇంతియాజ్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ విజేతలను స్టేడియం కోచ్ యూసఫ్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పాపా అభినందించారు.

News September 21, 2025

కర్నూలులో రూ.100కే 45 కిలోల ఉల్లి: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును జేసీ నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు పరిహారం ఇస్తున్నందున ఈనెల 22 నుంచి మద్దతు ధర రూ.1,200 కలిపి వేస్తున్నామన్నారు.

News September 21, 2025

కర్నూలులో రూ.100కే 45 కిలోల ఉల్లి: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును జేసీ నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు పరిహారం ఇస్తున్నందున ఈనెల 22 నుంచి మద్దతు ధర రూ.1,200 కలిపి వేస్తున్నామన్నారు.

News September 21, 2025

సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

image

దసరా సెలవుల్లో ప్రత్యేకత తరగతుల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు పోయించుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈవో శామ్యూల్ పాల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు పాఠశాలలపై ఫిర్యాదుల వచ్చాయన్నారు. విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పాఠశాలను మూసివేయిస్తారని హెచ్చరించారు.

News September 21, 2025

చెరువులను నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని మిగిలిన 206 చెరువులు నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాలను గణనీయంగా పెంచాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలులోని కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 21, 2025

పత్తికొండలో ఈనెల 22న జాబ్ మేళా

image

పత్తికొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.మాధురి, నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News September 20, 2025

వాల్మీకి మహర్షి విగ్రహం వివాదం.. టీజీ కుటుంబంపై తప్పుడు ప్రచారం: నేతలు

image

అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి టీజీ కుటుంబం పాటుపడుతోందని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు, నాయకులు నంది మధు, దశరథ రామనాథనాయుడు పేర్కొన్నారు. కర్నూలులో ఏ ఘటన జరిగినా మంత్రి టీజీ భరత్ కుటుంబానికి ఆపాదించడం కొందరు అలవాటు చేసుకున్నారని మండిపడ్డారు. వాల్మీకి మహర్షి విగ్రహం తొలగింపు విషయంలో మంత్రి భరత్ ప్రమేయం ఉందంటూ మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు.