Kurnool

News August 11, 2024

తూర్పు గోదావరి జేసీగా నంద్యాల జిల్లా వాసి

image

తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన ఎస్.చిన్న రాముడు నియమితులయ్యారు. ఏపీఎస్సీ కార్పొరేషన్ VC&MDగా ఉన్న ఆయనను తూ.గో జేసీగా ప్రభుత్వం నియమించింది. అటు నంద్యాల పూర్వపు జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డిని సీతంపేట ITDA పీవోగా బదిలీ చేయగా.. మరోసారి బదిలీ చేస్తూ ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

News August 11, 2024

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి బండారు శేషన్న అనే వ్యక్తి ఆదివారం గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్సై గంగన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పుట్టి మునిగిన ప్రాంతాన్ని ఇంజిన్ బోట్‌లో వెళ్లి పరిశీలించారు. శేషన్న అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News August 11, 2024

విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి: DYFI

image

విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని DYFI జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం DYFI జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేశ్ మాట్లాడారు. విద్యుత్ సంస్థల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తోందని, ఏటా ఉద్యోగ విరమణ చేస్తున్న పోస్టుల్లో కొత్త నియామకాలు చేసేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థల ముందుకు రావడంలేదని అన్నారు.

News August 11, 2024

కర్నూలు జిల్లా కలెక్టర్‌కు సీఎం కీలక ఆదేశాలు

image

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై CM చంద్రబాబు సమీక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చూడాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు, సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

News August 11, 2024

తుంగభద్ర డ్యాం ఘటనపై మంత్రి భరత్ ఆదేశాలు

image

తుంగ‌భ‌ద్ర డ్యాం గేటు కొట్టుకుపోవ‌డంపై క‌ర్నూలు జిల్లా కలెక్టర్‌తో మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడారు. డ్యాంలో నీటి నిల్వ‌, ఔట్ ఫ్లోపై ఆరా తీసి పూర్తిస్థాయిలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశారు. టీబీ డ్యాం సంఘ‌ట‌న‌పై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేస్తున్నార‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌లెవ్వ‌రూ ఆందోళ‌న చెందొద్ద‌ని మంత్రి కోరినట్లు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

News August 11, 2024

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా

image

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్‌ను పంపాలని సీఎం వారికి సూచించారు.

News August 11, 2024

వాట్సాప్ నంబర్‌కు వీడియోలు పంపితే చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

image

ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలులోని ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలతో కర్నూలు కలెక్టర్ బిందు మాధవ్ శనివారం సమావేశం నిర్వహించారు. వాటిపై చర్చించి పలు సూచనలు చేశారు. బైక్ రైడింగ్, సైలెన్సర్లు తీసి శబ్దం చేసే వారి వీడియోలు తీసి వాట్సప్ నంబర్ 7777877722కు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు.

News August 11, 2024

రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి బీసీ

image

టీడీపీ ప్రభుత్వ హాయంలో రాయలసీమ సాగునీటి అవసరాలను గుర్తించి, సీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ ద్వారా కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు.

News August 10, 2024

BREAKING: శ్రీశైలం డ్యామ్ 4 గేట్ల మూసివేత

image

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గటంతో రాత్రి 10 గేట్లలో 4 గేట్లను అధికారులు మూసివేశారు. కేవలం 6 గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 1,62,114 క్యూసెక్కులు, రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 61,028 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1,85,664 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. డ్యామ్ నీటిమట్టం 882.70 అడుగులు. 202.9673 TMCలుగా ఉంది.

News August 10, 2024

ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్, సీసీ కెమెరాలపై ఎస్పీ సమీక్ష

image

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్, స్పెషల్ బ్రాంచ్, సీసీ కెమెరాల నిర్వహణ(PCR) మొదలగు విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు వారి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలు అక్కడ వర్గ, రాజకీయ కక్షలు, నెలకొనే ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు ,గొడవలు, అల్లర్లు మొదలగు వాటి గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.