Kurnool

News February 19, 2026

కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

image

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) <<19174453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.

News February 19, 2026

కర్నూలు: రేపే ఇంటర్వ్యూ.. జీతం రూ.20 వేలు

image

ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు కళాశాల ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి, 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.10 నుంచి రూ.20 వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు.

News February 19, 2026

హౌసింగ్ సమస్యలపై ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం

image

కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. సిమెంట్, స్టీల్ సరఫరా, నిర్మాణ బిల్లులు మరియు PMAY 2.0 Urban ఇళ్లకు సంబంధించిన వివరాల కోసం ప్రతి గురువారం ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
★ సంప్రదించాల్సిన నంబర్: 08518-257481

News February 18, 2026

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

image

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్‌రోల్‌మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.

News February 18, 2026

కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

image

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 18, 2026

కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.

News February 18, 2026

గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

News February 18, 2026

గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

News February 18, 2026

గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

News February 18, 2026

గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.