Kurnool

News August 3, 2024

దేశభక్తి భావన ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్స‌వం: కలెక్టర్

image

దేశభక్తి భావన ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేడుకలను మొక్కుబడిగా కాకుండా దేశ, రాష్ట్ర, జిల్లా సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని పేర్కొన్నారు.

News August 3, 2024

‘ఉచితంగా BSNL 4G సిమ్‌కు అప్ గ్రేడ్ చేసుకోండి’

image

కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో సుమారు 400 సెల్ టవర్ల ద్వారా 4G సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని BSNL కర్నూలు ఏరియా జనరల్ మేనేజర్ రమేశ్ శనివారం తెలిపారు. ఇప్పటికే 2G/3G సిమ్‌లు ఉపయోగిస్తున్నవారికి వారికి వారి ప్రాంతాలలో 4G సేవలను ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వారు తమ సిమ్‌ను అప్ గ్రేడ్ చేసిన తరువాత 2G/3G/4G సేవలను పొందవచ్చన్నారు. 2G/3G సిమ్‌లను 4Gకి అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు.

News August 3, 2024

ఏపీ, భారత్ క్రీడాకారులు విజయం సాధించాలి: కలెక్టర్

image

పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనే ఏపీ, భారత్‌కు చెందిన క్రీడాకారులు విజయం సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ ఛాంబర్ సమీపంలోని సెల్ఫీ స్టాండ్ వద్ద భారతీయ అథ్లెట్లకు ఆయన థంబ్స్ చీర్ చూపించారు. క్రీడాకారులు విజయం సాధించి, ప్రపంచానికి మన భారత కీర్తిని చాటి చెప్పాలని ఆకాంక్షించారు.

News August 3, 2024

శ్రీశైలం ఆలయ ఏఈవో, పర్యవేక్షకుడి సస్పెండ్

image

శ్రీశైల ఆలయంలో క్యూలైన్ల ఏఈవో జి.స్వాములు, ఇన్‌ఛార్జి పర్యవేక్షకుడు గంజి రవిని సస్పెండ్ చేస్తూ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. క్యూలైన్లలో విధులు నిర్వర్తించే పొరుగు సేవల సిబ్బంది మద్యం తాగి దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈవో చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పొరుగు సేవల సిబ్బంది నాగేంద్రను విధుల నుంచి తొలగించారు. కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

News August 3, 2024

నైట్ ల్యాండింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో రన్ వే ఎక్స్టెన్షన్, విమానాలు రాత్రి సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేలో కల్పించాల్సిన సౌకర్యాలు, కావలసిన నిధుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎయిర్పోర్ట్ డైరక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్ ఎయిర్పోర్ట్‌లోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఛాంబర్‌లో రన్ వే ఎక్స్టెన్షన్, నైట్ ల్యాండింగ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

News August 2, 2024

నంద్యాల: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

image

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి తల్లిబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపు ముర్రుపాలు తాగించాలని, దీంతో బిడ్డకు వ్యాధి నిరోధకత పెరిగి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు.

News August 2, 2024

నైట్ ల్యాండింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో రన్ వే ఎక్స్టెన్షన్, విమానాలు రాత్రి సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేలో కల్పించాల్సిన సౌకర్యాలు, కావలసిన నిధుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎయిర్పోర్ట్ డైరక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్ ఎయిర్పోర్ట్‌లోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఛాంబర్‌లో రన్ వే ఎక్స్టెన్షన్, నైట్ ల్యాండింగ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

News August 2, 2024

నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య

image

నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ కేసులోని A1 ముద్దాయి అల్లూరి వెంకటసాయి అలియాస్ ఖవ్వను అయ్యాలూరు మెట్ట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో కిరాతకంగా చంపారు. జైలుశిక్ష అనుభవించి బెయిల్ మీద ఉన్న అతన్ని చంపడం పట్టణంలో కలకలం సృష్టించింది. పాత నేరస్థులే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News August 2, 2024

పింఛన్ సొమ్ము స్వాహా.. నంద్యాల జిల్లాలో ఉద్యోగి సస్పెండ్

image

పింఛన్ సొమ్ము స్వాహాకు పథకం రచించిన జేఎల్ఎంను అధికారులు సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వెంగళాంపల్లి సచివాలయంలో పనిచేస్తున్న జేఎల్ఎం పవన్ గురువారం పింఛన్ పంపిణీకి బయలుదేరారు. 50 మందికి చెందిన రూ.2,23,500 తీసుకుని బైక్‌పై వెళ్తుండగా డబ్బుల బ్యాగ్ పోయిందని అధికారులకు తెలిపారు. ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పవన్‌ను విచారించారు. స్వాహా యత్నం అని తెలుసుకుని డబ్బులు రికవరీ చేశారు.

News August 2, 2024

మిద్దె కూలి నలుగురి మృతి.. నంద్యాల జిల్లాలో విషాదం

image

నంద్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు తమ పిల్లలతో కలిసి నిద్రించగా వారి జీవితాలు నిద్రలోనే తెల్లారాయి. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా మట్టి మిద్దె కూలి వారిపై పడటంతో నలుగురూ చనిపోయారు. ఈ ఘటనతో చిన్న వంగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.