India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలులో ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC, లోన్ ఆఫర్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రెండు రోజులుగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కర్నూలు జట్టు మొదటి స్థానం, కృష్ణాజిల్లా జట్టు రెండవ స్థానం, గుంటూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది.

ఆళ్లగడ్డలోని పుల్లారెడ్డి వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవిస్తున్న రాజస్థాన్కు చెందిన సత్యనారాయను సయామి(25) ఇంట్లో ఉరివేసుకొని అనుమానాదాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై ఉరివేసుకొన్నట్లు భావిస్తున్నారు.

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని పేర్కొన్నారు. Meekosam.ap.gov.in అర్జీలు నమోదు చేసుకోవాలన్నారు.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ఉత్సాహంతో వెళ్లిన యాత్ర విషాదంగా ముగిసింది. ఆలూరు మండలం తుంబలబీడుకు చెందిన సలువప్ప చిన్న కుమారుడు ఎం.సిద్ధార్థ(12) శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ ప్రధాన రహదారి పక్కన ఉన్న నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా నాయకుడు సజ్జల నాగేంద్ర ఖండించారు. శిరివెళ్లలో ఆయన మాట్లాడుతూ.. చేతనైతే కరవు సీమలో కన్నీళ్లు తుడిచే పనులు చేయాలని బైరెడ్డికి సూచించారు. విలువలతో కూడిన రాజకీయం మీలాంటి ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకు అర్థం కాదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఓవర్ స్పీడ్ 1,189, హెల్మెట్ లేకుండా 1,075, సెల్ఫోన్ డ్రైవింగ్ 260 కేసులతో పాటు 1,069 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,908 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నూలు జిల్లాకు మళ్లీ మొండి చెయ్యి చూపారని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి ఆరోపించారు. రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేవన్నారు. కేవలం మరమ్మతుల కోసం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలకు నిధులు లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసిన ఊటూపల్లి మహేంద్రబాబును కర్నూలు 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు పంపించి పలువురిని మోసం చేసినట్టు వారు తెలిపారు. గతంలో పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేసులోనూ అతనిపై కేసు నమోదై ఉందన్నారు. ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.

చిప్పగిరి మండలం నంచర్లలో విషాదం చోటుచేసుకుంది. గుడిసె సావిత్రి(34) అనారోగ్యంతో మనస్తాపానికి గురై పురుగు మందు మాత్రలు మింగినట్లు పోలీసులు తెలిపారు. భర్త గమనించి ఆమెను ముందుగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.