India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధర రూ.7,550లతో ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందని మార్క్ఫెడ్ డీఎం హరినాథ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక రైతుకు రోజుకు 40 క్వింటాళ్ల పరిమితిని విధించినట్లు చెప్పారు. బుధవారం నుంచి ప్రతి రైతు సేవ కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఐపీఎస్ భార్యాభర్తలిద్దరూ కర్నూలులో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్గా ఆయన సతీమణి దీపికను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్గా దీపిక ఉన్నారు. కాగా, తన అన్న స్నేహితుడైన విక్రాంత్ పాటిల్తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.
మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం కూటమిలో దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో మంత్రి TG <<15206909>>భరత్<<>> మరో అడుగు ముందుకేసి ‘ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్లో కాబోయే సీఎం లోకేశ్’ అంటూ జ్యూరిచ్లో సీఎం చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టారు. ఈ అంశం మరింత చర్చకు తావిచ్చింది. మరి మంత్రి భరత్ వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.
కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా <<15208705>>ఐపీఎస్<<>> అధికారి విక్రాంత్ పాటిల్ నియమితులైన విషయం తెలిసిందే. విక్రాంత్ గతంలో చిత్తూరు జిల్లా ఎస్పీ, విజయవాడ డీసీపీ, చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్, మన్యం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్గా ఉన్నారు. ఆయన సతీమణి దీపికా పాటిల్ కూడా ఐపీఎస్ అధికారే. గతంలో కర్నూలు ఏఎస్పీగా సేవలందించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అధికారి తన లాగిన్లో ఉన్న అర్జీలను అదే రోజు చూసి యాక్సెప్ట్ చేయడం లేదా సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.
ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించింది. మహమ్మద్ రఫీ అలియాస్ పెద్దలాలు అనే వ్యక్తిపై నేరం రుజువు కావడంతో ఆళ్లగడ్డ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శైలజ ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో విచారణ అధికారిగా ప్రీతం రెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణారెడ్డి, శివప్రసాదరావులు తమ వాదనలు వినిపించారు.
తనను ప్రేమ పేరుతో నమ్మించి ఓ లెక్చరర్ మోసం చేశాడని ఓ యువతి సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కౌతాళం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఆయన 2023-24 సంవత్సరంలో ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపారు. అప్పటి నుంచి ఇరువురం ప్రేమలో ఉన్నామని పేర్కొన్నారు. తాజాగా ఇష్టం లేదంటూ పెళ్లికి నిరాకరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్త నదుల సంఘం క్షేత్రంలోని సంగమేశ్వరాలయం నెమ్మదిగా బయలు పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 855.90 అడుగుల మేర నీటి నిల్వలు ఉండడంతో ఆలయం పది అడుగుల మేర బయల్పడింది. మరో 18 అడుగులు తగ్గినట్లయితే ఆలయం పూర్తిస్థాయిలో బయలు పడనుంది. జులై నెలలో నీటి మునిగిన సంగమేశ్వరుడు నెమ్మదిగా జలాధివాసం నుంచి విముక్తి పొందుతున్నారు.
బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి(39) కడుపు నొప్పి తాళలేక పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడ్ ఆదివారం తెలిపారు. కొంతకాలంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండేదని, వైద్యం చేయించినా నయం కాలేదన్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.