India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. విజయనగరం విద్యార్థి సాయికార్తీక్ తొమ్మిదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయికార్తీక్ ఈసీఈ మూడో సంవత్సరం చుదువుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
నాపరాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి మహిళ దుర్మరణం చెందిన ఘటన శనివారం జరిగింది. బేతంచెర్ల మండలం బలపాలపల్లె నుంచి పాపసాని కొట్టాల వెళ్లేందుకు ట్రాక్టర్లో శశికళ(29) ఎక్కింది. బలపాలపల్లె గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. నాపరాలు ఆమెపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.
భార్యను చూసేందుకు నిలిపి ఉన్న RTC బస్సు తీసుకెళ్లిన ఘటన ఆత్మకూరులో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మకూరు (మం) వెంకటాపురానికి చెందిన దర్గయ్య లారీ డ్రైవర్. విధులకు వెళ్లగా.. భార్య పుట్టినిల్లు ముచ్చుమర్రికి వెళ్లింది. ఇంటికి వచ్చిన దర్గయ్య.. భార్య లేదని తెలిసి ఆత్మకూరు బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సు తీసుకుని ముచ్చుమర్రికి వెళ్లాడు. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద ఆగస్టు నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,63,200 పింఛన్లకు రూ.196.42 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4,69,716 పింఛన్లు ఉండగా.. ఆగస్టు నెలకు వచ్చేసరికి 6,916 పింఛన్లపై కోత పడింది. కర్నూలు జిల్లాలో 2,43,337 పింఛన్లకు సంబంధించి రూ.103.54 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,19,863 పింఛన్లకు సంబంధించి రూ.92.88 కోట్లు మంజూరయ్యాయి.
కొత్తపల్లి మండలం పరిధిలో కృష్ణా నది తీరాన వెలసిన సంగమేశ్వరాలయం శ్రీశైలం వెనుక జలాలలో శిఖరంతో సహా పూర్తిగా జలాధివాసం కానుంది. తాజాగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో జలాధివాసమైంది. ఆలయంలో కొలువైన వేపదార శివలింగం దర్శనం 7 నెలల తర్వాత ఉండవచ్చని ఆలయ అర్చకులు తెలకపల్లి గ్రామశర్మ తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ రంజిత్ బాషా పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో R&B, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రోచ్ రోడ్డు వేయని గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ఇందులో రెండు కిలోమీటర్ల లోపు రోడ్లు ఉంటే, వాటిని ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్లను నిర్మిస్తామని తెలిపారు.
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్కుమార్ ఆ స్థలాన్ని మొత్తం 15 దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఐజీ చర్యలు తీసుకున్నారు.
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్, పాన్కార్డు, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని భయపెట్టి వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారని, ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100కు కాల్ చేస్తే పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు.
కర్నూలు నగర పాలక సంస్థలో అదనపు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న పి.వి.రామలింగేశ్వర్ను నూతన కమిషనర్గా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మునిసిపల్శాఖ డైరెక్టర్ హరినారాయణ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కర్నూలు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన భార్గవ తేజ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించిన సంగతి విదితమే.
కర్నూలు, నంద్యాల జిల్లాలను కలుపుతూ అవసరమైన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే బడ్జెట్లో పొందుపరిచారు. దీనికి అనువుగా సిమెంట్ నగర్ నుంచి దూపాడు రైల్వే స్టేషన్ వరకు 47 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. దీంతో హైదరాబాదు నుంచి కర్నూలుకు వస్తున్న రైళ్లను నంద్యాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.