Kurnool

News December 26, 2024

శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 26, 2024

శ్రీశైలంలో 112.7 TMCల నీరు నిల్వ

image

శ్రీశైల డ్యాం బ్యాక్ వాటర్ ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో 6,366 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రానికి 241, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,590, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాంలో 862.20 అడుగుల్లో 112.7164 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News December 26, 2024

కర్నూలు: రైలు నుంచి పడిపోయిన యువతి

image

కర్నూలు జిల్లా యువతి రైలు నుంచి జారిపడిపోయింది. దేవనకొండ(M) కరివేములకు చెందిన హరిత తమ్ముడితో కలిసి గుత్తికి రైల్లో బయల్దేరింది. మార్గమధ్యలో బాత్‌రూముకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తమ్ముడు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించాడు. హరిత ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

News December 26, 2024

నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.

News December 25, 2024

శిల్పా రవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

image

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తన స్నేహితుడు అల్లు అర్జున్ కష్టాల్లో ఉంటే కనీసం కనిపించకపోవడం ఏంటని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అరెస్ట్ అయిన సమయంలోనూ స్పందించలేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వీటికి శిల్ప అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. అందులో వాస్తవం లేదని కామెంట్ చేస్తున్నారు.

News December 25, 2024

హిజ్రాతో కుమారుడి ప్రేమ.. నంద్యాలలో తల్లిదండ్రుల ఆత్మహత్య

image

హిజ్రాతో కుమారుడి ప్రేమ దంపతుల ప్రాణం తీసింది. నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన సరస్వతి, సుబ్బరాయుడుల కుమారుడు సునీల్ ఆటో నడుపుతూ ఓ హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడిని బంధువుల ఇంటికి పంపారు. అప్పటి నుంచి హిజ్రాలు సుబ్బరాయుడు దంపతులను వేధింపులకు గురిచేస్తున్నారు. కుమారుడూ హిజ్రానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపం చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందారు.

News December 25, 2024

నంద్యాల: చనిపోతున్నా అంటూ ఫోన్.. కాపాడిన పోలీసులు

image

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కృష్ణాపురంలో శివకుమార్ అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ ఆదేశాల మేరకు అతడి ఫోన్ సిగ్నల్ లొకేషన్‌ను గుర్తించి పోలీసులు ఆయన్ని ఆత్మకూరు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.

News December 25, 2024

కోడుమూరులో టీచర్‌పై పోక్సో కేసు

image

కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రైవేట్ టీచర్ భాస్కర్ ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఆయన కోడుమూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News December 25, 2024

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు ఎస్పీ

image

కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు గొప్ప జీవితాన్ని, ఆయన కరుణ, క్షమాపణ సందేశాన్ని, నిత్య సత్యాన్ని విలువలను నిలబెట్టడానికి ఆయన పడిన కష్టాలను ప్రజలకు గుర్తు చేస్తుందన్నారు. క్రిస్మస్ పండుగ ప్రజలందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు.

News December 24, 2024

లింక్ వస్తుంది.. మోసం మొదలవుతుంది: కర్నూలు ఎస్పీ

image

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనల పట్ల జాగ్రత వహించాలని పిలుపునిచ్చారు. ‘లైక్, షేర్ చేస్తే .. రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తారు. ఆలోచించండి, మోసపోకండి’ అని ఎస్పీ హెచ్చరించారు. మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.