Kurnool

News December 16, 2024

ఎమ్మిగనూరు: ‘అభివృద్ధిలో దమ్ము చూపించండి’

image

మీసాలు గడ్డాలు గురించి కాదని, అభివృద్ధిలో పోటీ పడాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవరెడ్డికి కూడా మీసాలు లేవని ఎద్దేవా చేశారు. 168 టీసీలకు ఎన్నికలు జరిగితే పార్లపల్లిలో చెన్నకేశవరెడ్డి నిరసన చేయటంపై మండిపడ్డారు. కడిమెట్ల గ్రామానికి తాగడానికి నీళ్లు ఇచ్చేది మీసాలు లేని ఎమ్మెల్యే అని హితవు పలికారు.

News December 16, 2024

కర్నూలు: ‘గ్రివెన్స్ డేకు 93 ఫిర్యాదులు’

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 93 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు.

News December 16, 2024

ఆళ్లగడ్డలో మంచు మనోజ్ కీలక ప్రకటన చేస్తారా?

image

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. నేడు శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఆళ్లగడ్డలోని భూమా ఘాట్‌లో నివాళి అర్పించిన అనంతరం రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఓ పార్టీలో చేరి నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మనోజ్ దంపతులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News December 16, 2024

బనగానపల్లె విద్యార్థులకు బంపర్ ఆఫర్

image

బనగానపల్లె నియోజకవర్గ విద్యార్థులకు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నంద్యాల జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రథమ ర్యాంక్ సాధించిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

News December 16, 2024

నేడు ఆళ్లగడ్డకు మంచు మనోజ్, భూమా మౌనిక!

image

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక నేడు ఆళ్లగడ్డకు రానున్నారు. ఇవాళ శోభానాగిరెడ్డి జయంతి కావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు వస్తున్నట్లు సమాచారం. భూమా ఘాట్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘మంచు’ ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో వారి రాకపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి వారు నివాళులు అర్పించనున్నట్లు సమాచారం.

News December 16, 2024

సూపర్‌-7 సబ్‌ జూనియర్‌ నంద్యాల జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

image

చాగలమర్రిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సూపర్‌-7 సబ్‌జూనియర్‌ నంద్యాల జిల్లా క్రికెట్‌ జట్టును ఆదివారం ఎంపిక చేశారు. నంద్యాల జిల్లా కార్యదర్శి కడ్డీ మహబూబ్‌ బాషా మాట్లాడుతూ.. స్థానిక క్రీడా మైదానంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సబ్ జూనియర్ క్రికెట్ క్రీడాకరులకు ఒక రోజు పాటు శిక్షణ ఇచ్చామన్నారు. అందులో 15 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామన్నారు.

News December 15, 2024

భారత సెపక్ తక్రా సంఘం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు

image

ఢిల్లీలో ఆదివారం జరిగిన భారత సెపక్ తక్రా సంఘం ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ సెపక్ తక్రా సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఉన్న జీ.శ్రీనివాసులు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసులు ఎన్నికపట్ల కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు కేఈ జగదీశ్ కుమార్, ఒలంపిక్ సంఘం సీఈఓ విజయకుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు సునీల్, పీఈటీ, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.

News December 15, 2024

రేపు నంద్యాల కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ

image

ఈ నెల 16న నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమం సంబంధింత అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.

News December 15, 2024

అమరజీవి యువతరానికి ఆదర్శప్రాయుడు: కలెక్టర్

image

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని కలెక్టర్‌ పీ.రంజిత్ బాషా అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల లేసి కలెక్టర్ నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు.

News December 15, 2024

నంద్యాల మీదుగా వెళ్లే ప్యాసింజర్ రద్దు

image

గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ రైలు (17228)ను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26 వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు రైలును 17- 27 వరకు రద్దు చేశారు. పూరి – గిద్దలూరు- యశ్వంత్ పూర్ (22883) రైలును డోన్ మీదుగా కాకుండా నంద్యాల నుంచి యర్రగుంట్ల వైపు ఈనెల 20వ తేదీ వరకు మళ్లించారు.