Kurnool

News July 2, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి పత్తికొండ ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకం ఏర్పాటు

image

పత్తికొండ: ప్రజా సమస్యల పరిష్కారానికై “ఎమ్మెల్యే హెల్ప్ లైన్”పుస్తకాన్ని ప్రవేశ పెట్టామని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా టీడీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

News July 2, 2024

ఎమ్మిగనూరు మండలానికి చేరిన తుంగభద్ర డ్యాం నీరు

image

రెండు నెలల కిందట తాగు నీటి కోసం కర్నూలు వరకు పులికనుమ ప్రాజెక్ట్ నుంచి పది రోజుల పాటు ఎల్‌ఎల్‌సీ కాలువకు నీరు వదిలారు. తాజాగా తాగునీటి కోసం నేరుగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయగా మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు మండలానికి చేరుకున్నాయి. దీంతో తాగునీటి సమస్యతో పాటు పొలాలకు నీరు పెట్టుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 2, 2024

కర్నూలు: అప్పు విషయంలో తగదా.. అన్నదమ్ములపై హత్యాయత్నం కేసు

image

కర్నూలు సాయినగర్‌కు చెందిన రఘ, రవికుమార్‌ అనే అన్నదమ్ములపై నాలుగో పట్టణ పోలీసు‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. కర్నూలులోని చింతల మునినగర్‌కు చెందిన చలపతి నుంచి రూ.12లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలో వివాదం నెలకొంది. దీంతో వారు కక్షతో బైక్‌పై వెళుతున్న చలపతిని ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 2, 2024

కర్నూలు: పింఛన్ ఇప్పిస్తానని.. ఇల్లు రాయించుకున్న కొడుకు

image

కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన కె.శంకర్‌పై నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తల్లి సాలమ్మకు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఇల్లును శంకర్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయంపై నిలదీస్తే గొంతు నులిమి హత్యాయత్నం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

News July 2, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలకు రూ.299.91కోట్ల పింఛన్ పంపిణీ

image

కర్నూలు జిల్లాలో 2,45,229మంది లబ్ధిదారుల్లో సోమవారం 2,29,189 మందికి రూ.156.44 కోట్లు అందజేశారు. నంద్యాల జిల్లాలో2,21240మంది లబ్ధిదారుల్లో 2,11272 మందికి రూ.143.47కోట్లు అందజేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 93.46శాతం మందికి పంపిణీ చేసి రాష్రంలో 24వస్థానం, నంద్యాలలో 95.49శాతం మందికి పంపిణీ చేసి 13వస్థానంలో నిలిచాయి.

News July 2, 2024

కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ కృష్ణకాంత్

image

నిత్యం కొత్తగా వస్తున్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. కర్నూల్ రూరల్ సర్కిల్, ఉలిందకొండ పోలీస్టేషన్ ఆవరణంలో నూతన చట్టాలపై ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్త చట్టాలతో కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందని పేర్కొన్నారు.

News July 1, 2024

కోడి గుడ్డుపై సీఎం చంద్రబాబు చిత్రం

image

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాసులు సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడి చిత్రాన్ని కోడి గుడ్డుపై చిత్రించారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా చిత్రీకరించినట్లు శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. ఈ వినూత్నమైన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలోనూ కూటమి నేతల చిత్రాలను పచ్చి టెంకాయపై చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.

News July 1, 2024

పింఛన్ తీసుకున్న గంటకే వృద్ధుడి మృతి.. నంద్యాల జిల్లాలో ఘటన

image

నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గుమ్మడి పెద్ద సుబ్బారాయుడు (75) వృద్ధాప్య పింఛన్ తీసుకున్న గంటకే మృతి చెందారు. ఉదయం సచివాలయ సిబ్బంది రూ.7 వేల పింఛన్ అందజేయగా వయసురీత్యా ఉన్న అనారోగ్యంతో కాసేపటికే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

News July 1, 2024

కర్నూల్: కొనసాగుతున్న పింఛన్ పంపిణీ

image

కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లాలో 83.82, నంద్యాల జిల్లాలో 88.76 శాతం పంపిణీ పూర్తైంది. కర్నూల్ జిల్లాలో 2,45,229 మందికి గానూ 2,05,545 మందికి అందజేశారు. నంద్యాల జిల్లాలో 2,21,240 మందికి గానూ 1,96,382 మందికి పింఛన్ నగదు పంపిణీ చేశారు.

News July 1, 2024

కర్నూలు జిల్లా ఆవిర్భవించింది ఈరోజే

image

పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవైన కర్నూలు జిల్లా ఇదే రోజున ఆవిర్భవించింది. 1858 జులై 1 నుంచి 166 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా కేంద్రంగా సేవలందిస్తోంది. ఒకప్పుడు కందెనవోలుగా ప్రసిద్ధి చెంది కాలక్రమేణా కర్నూలుగా మారింది. 1953 OCT 1 నుంచి 1956 OCT 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాలతో నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పాటైంది.