India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ మధ్య రైల్వే నంద్యాల మీదుగా శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 07177-విజయవాడ నుంచి కొల్లాం, 07183-నరసాపురం నుంచి కొల్లాం, 07181-గుంటూరు నుంచి కొల్లాం రైల్లు. తిరుగు ప్రయాణంలో 07178-కొల్లాం నుంచి కాకినాడ, 07184-కొల్లాం నుంచి నర్సాపూర్, 07182-కొల్లాం నుంచి కాకినాడ, 07185-కొల్లాం నుంచి గుంటూరు రైళ్లు నంద్యాల మీదుగా ప్రయాణిస్తాయి. మరిన్ని వివరాలకు రైల్వే స్టేషన్లో సంప్రదించగలరు.
నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి, నీటి పన్నులను సకాలంలో వసూలు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. అందరూ సమన్వయం చేసుకొని, పన్ను బకాయిలను త్వరగా త్వరితగతిన వసూలు చేయాలని ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
కుల, మత బేధాలు లేకుండా ప్రజలందరూ సోదర భావంతో జీవించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్లో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో పాస్టర్లకు ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో వెంకటేశ్ పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కర్నూలు నగరం నిలుస్తోందని ఆయన అన్నారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)కు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఎన్నికయ్యారు. హీరో అక్షయ్ కుమార్కు చెందిన శ్రీనగర్ మహావీర్ టీమ్ హనుమంత్ రెడ్డిని బేస్ ప్రైజ్ రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 14 వరకు ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 6 జట్లు పాల్గొననుండగా హైదరాబాద్ టీమ్ను హీరో రామ్ చరణ్ కొనుగోలు చేశారు.
మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సమాధానం ఇచ్చింది. మహిళలను సోషల్ మీడియా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చా? అని ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాచార శాఖ రిప్లై ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ నేరాలకు పాల్పడే వారినీ చట్టప్రకారం శిక్షించొచ్చు’ అని స్పష్టం చేసింది.
డోన్లోని కోట్లవారి పల్లె సమీపాన రోజు కూలికి వెళ్లే మహిళ ఫ్యాక్టరీ పల్వరైజర్ మెషీన్లో ఇరుక్కుని మృతి చెందింది. మృతురాలు డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లోకేశ్వరమ్మగా స్థానికులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితలకు మోసపోయి సైబర్ నేరగాళ్లు వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే, బాధితులు 1930 నంబర్కు సమాచారం అందించాలన్నారు.
అమరావతిలోని సచివాలయం బ్లాక్- 2లో బుధవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో జరిగిన రెండో కలెక్టర్ల సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలు ఆయన నమోదు చేసుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా సదస్సుకు హాజరయ్యారు.
భూమా మౌనికకు తల్లిదండ్రులు ఉంటే తన తండ్రి ఇలా ప్రవర్తించే వారా? అని మంచు మనోజ్ ప్రశ్నించారు. ‘భూమా మౌనికను ప్రేమించా. పెళ్లి చేసుకున్నా. అందులో తప్పేముంది. నా భార్య వచ్చాక చెడ్డోడిని అయ్యానంటున్నారు. తాగుడికి బానిసయ్యానని మాట్లాడుతున్నారు. మౌనికకు తల్లిదండ్రులు ఉంటే ఇలా మాట్లాడేవారా. ఇప్పుడు ఆమెకు తల్లీ, తండ్రి అన్నీ నేనే. నా భార్య కష్టపడే వ్యక్తి. నిజాలు తర్వలో తెలుస్తాయి’ అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.