Kurnool

News December 11, 2024

అన్నదాతకు అండగా ఉద్యమిస్తాం: కాటసాని

image

అన్నదాతలకు అండగా నిలబడి ఉద్యమిస్తామని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు.

News December 11, 2024

నందికొట్కూరులో బాలికకు నిప్పు ఘటనలో బిగ్ ట్విస్ట్

image

నందికొట్కూరులో బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. లహరి (17) మృతికి అగ్నిప్రమాదమే కారణమని జిల్లా ఎస్పీ అధిదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. లహరి, రాఘవేంద్ర ఇంట్లో ఉన్న సమయంలో దోమల కాయిల్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందన్నారు. గదిలో ఉన్న టర్పెంట్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

News December 11, 2024

అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దు: ఎస్పీ

image

అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్​ లిఫ్ట్ చేస్తే వారు మీ కాల్‌ను రికార్డు చేసి పోలీసు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తారన్నారు. వేధింపులకు గురిచేసి మీ డబ్బులు దోచేస్తారని, అటువంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని ప్రజలను సూచించారు. సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.

News December 10, 2024

నంద్యాల-నందిపల్లె రైల్వే స్టేషన్ల మధ్య వ్యక్తి మృతి

image

నంద్యాల-నందిపల్లె రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియ రాలేదన్నారు. మృతుడు పసుపు, తెల్లని రంగు ఫుల్ హాండ్స్ టీ షర్టు, ఎరుపు, పసుపు కలర్ షార్ట్ ధరించినట్లు చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే రైల్వే నంద్యాల పోలీసులను సంప్రదించాలి అన్నారు.

News December 10, 2024

Rain Alert: కర్నూలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ నంబర్‌ 08518 277305కు ఫోన్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

News December 10, 2024

11, 12 తేదీల్లో రాయలసీమలో వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పంట కోతలు పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని తెలిపింది.

News December 10, 2024

ప్రేమోన్మాదిని పోలీసులే కాల్చి చంపాలి: బాలిక తల్లి

image

నందికొట్కూరులో ప్రేమోన్మాది బాలికకు <<14828920>>నిప్పు<<>> పెట్టిన ఘటనపై తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తనకున్న ఒక్క కూతురినీ అన్యాయంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూతురు లహరిని ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నా. అన్యాయంగా చంపేశాడు. వాడిని పోలీసులే కాల్చి చంపేయాలి. లేకుంటే నాకు అప్పగించండి.. సార్. ఇలాంటి ఉన్మాదులకు సమాజంలో బతికే హక్కులేదు’ అంటూ విలపించారు.

News December 10, 2024

బాలిక మృతి అత్యంత బాధాకరం: మంత్రి బీసీ

image

నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడిలో బాలిక మృతి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి అత్యంత బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్‌లో మాట్లాడి మంత్రి బీసీ.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పట్టిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.

News December 9, 2024

రాయలసీమలో మళ్లీ వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News December 8, 2024

వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత

image

వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.