India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

76వ గణతంత్ర వేడుకలకు నెల్లూరు కలెక్టరేట్ ముస్తాబైంది. త్రివర్ణ పతాక రంగులతో అలంకరించిన విద్యుత్ దీపాలంకరణలతో వెలిగిపోతున్నది. గణతంత్ర వేడుకల సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గిరిజన సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, ఇతర ప్రభుత్వ శాఖల పథకాలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నేడు నెల్లూరులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

కొండాపురం, లింగసముద్రం మండలాలతో పాటు నెల్లూరు, కావలి బఫర్ 104 అంబులెన్సుల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని 104 కార్యాలయంలో జనవరి 27, 28 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.

దుత్తలూరు మండలంలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో బొగ్గుబట్టీలు, ఇటుక బట్టీలు, కంకర క్రషర్ల వద్ద పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. కాలుష్యం నడుమ వారి ఆరోగ్యం దెబ్బతింటున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. బట్టీల వద్ద కార్మిక చట్టాలు అమలుకావటం లేదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు వాపోయారు.

కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్కు RDO వంశీకృష్ణ నోటీసులు జారీచేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రానికి ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ థియేటర్ యాజమాన్యం 24వ తేదీ కూడా అధిక రేట్లకు విక్రయించడంతో కావలికి చెందిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం దీనిపై వివరణ ఇవ్వాలని RDO ఆదేశించారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన 117 నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు మోడల్ స్కూల్ ప్రాంగణంలో క్విజ్, ఎస్సే రైటింగ్ , వక్తృత్వ పోటీలను నిర్వహించారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ విద్యార్దులను అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు.

ఉదయగిరి మండలం బిజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ వరి కోత మిషన్లో ఇరుక్కుని పోయి ఉండగా రైతులు గమనించి చంపేశారు. సమీపంలోనే పాఠశాల ఉండడం విద్యార్థులు తరచుగా అటు ఇటు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రేపు గూడూరు డివిజన్ కు రానున్నారు. చిల్లకూరు సాగరమాల జాతీయ రహదారి package-4 నిర్మాణ పనులు పరిశీలించుటకు రానున్నట్లు తెలుస్తోంది. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతమేరకు జరిగాయి అన్న వివరాలు తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఆన్లైన్ మోసాలు రోజుకొక కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఉదయగిరిలో నకిలీ ఫోన్పే యాప్తో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో రూ.4 వేలకుపైగా మద్యం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా నగదు పంపించాడు. అయితే డబ్బులు రాకపోవడంతో అనుమానించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.

నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ రకాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను spsrnellore.ap.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ ద్వారా తెలియపరచాలన్నారు.

న్యూఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ లింగుంటి వెంకట నరసయ్య (41) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామానికి చెందినవారు. ఇటీవల సంక్రాంతి పండగకు వచ్చిన ఆయన తిరిగి ఈనెల 20న న్యూఢిల్లీకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. జవాన్ మృతితో గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
Sorry, no posts matched your criteria.