Nellore

News May 11, 2024

మనుబోలు ప్రమాదంలో ఇరువురు మృతి

image

జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లకూరు మండలం చిల్లకూరుకు చెందిన వేణు, ఆకాష్ బైక్ పై నెల్లూరు నుంచి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వేణు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆకాష్ నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

నెల్లూరులో ఈ అభ్యర్థులు వారి ఓటు వారికే వేసుకోలేరు..!

image

కొద్ది రోజులుగా అందరి ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థుల్లో కొందరు తమ ఓటు తమకు వేసుకోలేరు. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారికి ఓటు లేకపోవడమే కారణం. కోవూరులో హోరాహోరీగా తలపడుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కోటలో, వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు రూరల్‌లో ఓటు ఉంది. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి నెల్లూరు రూరల్‌లో, ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటు ఆత్మకూరులో ఉంది.

News May 11, 2024

నెల్లూరు: ‘సెలవు ఇవ్వకపోతే కాల్ చేయండి’

image

దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినట్లు కార్మిక శాఖ గుంటూరు జోన్ సంయుక్త కమిషనర్ శ్రీనివాస కుమార్ తెలిపారు. ఈ విషయంలో కార్మికులతో పాటు యజమానులకు ఏమైనా సమస్యలు ఉంటే 94925 55145 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

News May 10, 2024

నెల్లూరులోనే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 22,650 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈసీ లెక్కల ప్రకారం నెల్లూరు సిటీలో 2,698 మంది, ఆత్మకూరులో 2,611 మంది, ఉదయగిరిలో 2,493 మంది, కావలిలో 3,235 మంది, నెల్లూరు రూరల్‌లో 4,741 మంది, కోవూరులో 2,838 మంది, కందుకూరులో 1,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

News May 10, 2024

నెల్లూరు: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున స్టార్ క్యాంపెయినర్ల రాకతో నెల్లూరు వార్తల్లో నిలిచింది. తాజా ఎన్నికల్లో వేమిరెడ్డి కుటుంబంతో పాటు మరికొందరు కీలక వైసీపీ నేతలు టీడీపీలోకి మారడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.

News May 10, 2024

మనుబోలు జాతీయరహదారిపై ప్రమాదం

image

మనుబోలులోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేగంగా వెళుతున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.   

News May 10, 2024

NLR: చివరి ప్రయత్నాల్లో నాయకుల బిజీ..?

image

నెల్లూరు జిల్లాలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈనేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశారు. రాత్రికి వచ్చి నగదు ఇస్తామని చెబుతున్నారట. మరికొన్ని చోట్ల ఓటర్ల జాబితా ఆధారంగా ఇప్పటికే తాయిళాల పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News May 10, 2024

ఫీజు అడిగితే ఫోన్ చేయండి: DEO

image

NLR: విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు స్కూళ్లలోని ఒకటో తరగతిలో 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లు ఇప్పించినట్లు నెల్లూరు డీఈఓ రామారావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో మొదటి విడతగా 893 మందికి అడ్మిషన్ ఇప్పించినట్లు వెల్లడించారు. వీరిని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తిరస్కరించినా, ఫీజులు అడిగినా 9493233813 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News May 10, 2024

NLR: 12న జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక

image

నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరులోని సీఐఏ క్రికెట్ అకాడమీ మైదానంలో జిల్లా జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అండర్-19 బాలురు, మధ్యాహ్నం 3 గంటలకు అండర్-15, 19 బాల, బాలికల జట్లు ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నిఖిలేశ్వర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఏసీ స్టేడియంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News May 10, 2024

కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్

image

నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడికి హైదరాబాద్‌కు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. నెల్లూరులోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం పెళ్లి చేసేందుకు రూ.లక్షల ఖర్చుతో అన్ని ఏర్పాట్లు చేశారు. వధువు వైపు వారు మండపానికి చేరుకున్నారు. ఎంతసేపయినా వరుడితో పాటు కుటుంబసభ్యులు రాలేదు. వాళ్ల ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి కన్నీటి పర్యంతమయ్యారు.