India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలో అటవీ అనుమతులు రాక హైవే పనులు ఆగిపోయాయి. నెల్లూరు-చిలకలూరిపేట హైవే స్టేజ్-1 కింద 10.37 హెక్టార్లకు 2003 నుంచి ప్రయత్నిస్తే గతేడాది పర్మిషన్ వచ్చింది. స్టేజ్-2 అనుమతులకు ఈనెల 13న కేంద్రానికి ఫారెస్ట్ శాఖ ప్రతిపాదన పంపింది. నెల్లూరు-బద్వేల్ NH-65కి గతేడాదిలో ప్రతిపాదనలు పంపినా రాలేదు. అటవీ శాఖకు హైవే సంస్థ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉండటంతోనే పర్మిషన్లు ఆలస్యమవుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో అటవీ అనుమతులు రాక హైవే పనులు ఆగిపోయాయి. నెల్లూరు-చిలకలూరిపేట హైవే స్టేజ్-1 కింద 10.37 హెక్టార్లకు 2003 నుంచి ప్రయత్నిస్తే గతేడాది పర్మిషన్ వచ్చింది. స్టేజ్-2 అనుమతులకు ఈనెల 13న కేంద్రానికి ఫారెస్ట్ శాఖ ప్రతిపాదన పంపింది. నెల్లూరు-బద్వేల్ NH-65కి గతేడాదిలో ప్రతిపాదనలు పంపినా రాలేదు. అటవీ శాఖకు హైవే సంస్థ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉండటంతోనే పర్మిషన్లు ఆలస్యమవుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో అటవీ అనుమతులు రాక హైవే పనులు ఆగిపోయాయి. నెల్లూరు-చిలకలూరిపేట హైవే స్టేజ్-1 కింద 10.37 హెక్టార్లకు 2003 నుంచి ప్రయత్నిస్తే గతేడాది పర్మిషన్ వచ్చింది. స్టేజ్-2 అనుమతులకు ఈనెల 13న కేంద్రానికి ఫారెస్ట్ శాఖ ప్రతిపాదన పంపింది. నెల్లూరు-బద్వేల్ NH-65కి గతేడాదిలో ప్రతిపాదనలు పంపినా రాలేదు. అటవీ శాఖకు హైవే సంస్థ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉండటంతోనే పర్మిషన్లు ఆలస్యమవుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో అటవీ అనుమతులు రాక హైవే పనులు ఆగిపోయాయి. నెల్లూరు-చిలకలూరిపేట హైవే స్టేజ్-1 కింద 10.37 హెక్టార్లకు 2003 నుంచి ప్రయత్నిస్తే గతేడాది పర్మిషన్ వచ్చింది. స్టేజ్-2 అనుమతులకు ఈనెల 13న కేంద్రానికి ఫారెస్ట్ శాఖ ప్రతిపాదన పంపింది. నెల్లూరు-బద్వేల్ NH-65కి గతేడాదిలో ప్రతిపాదనలు పంపినా రాలేదు. అటవీ శాఖకు హైవే సంస్థ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉండటంతోనే పర్మిషన్లు ఆలస్యమవుతున్నాయి.

మనుబోలు మండలం కొమ్మలపూడి, వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య 157/08_10 వద్ద పట్టాల సమీపంలో ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. సహజంగా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. బ్రౌన్ కలర్ ఫుల్ హాండ్స్ స్వెటర్, ఎరుపు, తెలుపు గీతల చొక్కా, పాచి కలర్ టీషర్ట్, స్కై బ్లూ బనియన్, నలుపు రంగు జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు.

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్ఆర్ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.

నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కానింగ్ సెంటర్ల విషయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని సూచించారు.

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బాల్య వివాహ ముక్త భారత్పై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా DLSA సెక్రటరీ కె.వాణి మాట్లాడుతూ.. పిల్లలు బాగా చదివి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పిల్లలకు మధ్యలో చదువులు ఆపి బాల్యవివాహాలు చేస్తే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098, 15100 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.

నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం ప్రకటించారు. నెల్లూరు రూరల్ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. వేదగిరి ఆలయానికి 1176 ఎకరాల ఉన్నాయని.. అందులో 100 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇదే ఆలయ అభివృద్ధికి రూ.8.70 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 57 ఆలయాలను రూ.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.