India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలో ఈనెల 27 నుంచి ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ ఆర్ఐ, DEC సభ్యులతో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.విజయ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తన ప్రతిభ చూపారు. ఆయన అందించిన సేవలకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. అత్యధికంగా ఓటర్ల మ్యాపింగ్ చేయడంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈనెల 25వ తేదీ జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు.

నెల్లూరు జిల్లాలో 2,942 అంగన్వాడీ కేంద్రాలకు 1,037 సొంత భవనాల్లో మిగిలినవి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 401 కేంద్రాలను సక్ష అంగన్వాడీలకు కేంద్రం అభివృద్ధి చేస్తోంది. రూ.1.83కోట్లు ఖర్చు చేసి అంగన్వాడీల్లో కూరగాయలు పండించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, టీవీ, బొమ్మలు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పిస్తోంది. మరో 205 కేంద్రాల అభివృద్ధికి గతేడాది ప్రతిపాదనలు పంపారు. వీటిని సైతం త్వరలో అభివృద్ధి చేస్తారు.

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ. కూటమి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పాపాలు వారికి భవిష్యత్తులో శాపాలుగా మారుతాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాగ సాధువుల ముసుగులో ఓ ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో హల్చల్ చేశారు. ఓ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమని అడిగారు. వారు లేదని చెప్పడంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాగసాధువు ముసుగులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బూతులు మాట్లాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం నీరుగారుతోంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 24,459 మంది గర్భిణీలు నమోదవ్వగా 12,353 మందికి ఆర్థిక సాయం అందింది. 12,106 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 10,656 మంది దరఖాస్తులు వివిధ సమస్యలతో రిజెక్ట్ అయ్యాయి. మొదటి కాన్పుకు ₹5 వేలును రెండు విడతల చొప్పున ఇవ్వాలి. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో ₹6వేలు తల్లి ఖాతాకు జామ చేస్తారు.

గత 12 ఏళ్లలో ముత్తుకూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014లో కేవలం చేపల వేట, రొయ్యల సాగుకే పరిమితమైన ఈ తీర ప్రాంతం, 2026 నాటికి ఏపీలోనే కీలక ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. అదానీ పోర్ట్ విస్తరణ, భారీ థర్మల్ ప్లాంట్లు, 4-లేన్ రోడ్లతో నేడు గ్లోబల్ మ్యాప్లోకి ఎక్కింది. నాడు వలసలకు నిలయమైన ముత్తుకూరు, నేడు వేలాది మందికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ, రియల్ ఎస్టేట్లో రికార్డులు సృష్టిస్తోంది.

రైతులకు సాగు పాఠాలు నేర్పే పొలం’బడి’ కార్యక్రమం తడబడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో 30 మంది రైతులతో ప్రతీ మంగళ, బుధవారాలు వరుసగా 14 వారాలపాటు కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా ఆచరణలో నీరుగారుతోంది. 24-25 ఏడాదికి జిల్లా వ్యాప్తంగా 31 పొలం బడి శిక్షణ తరగతులు చేపట్టాల్సి ఉన్నా పలుచోట్లా మొదలెట్టలేదు. వీటి నిర్వహణకు ₹10.85 లక్షలు కేటాయించారు. అధికారులు స్పందన లేకపోవడంతో ఆ నిధులు సైతం పక్కదారి పడుతున్నాయట.

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కొరవడుతోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాలల సంరక్షణకు అమలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు పడకేశాయి. వీటి కోసం గతేడాది ₹3.50 లక్షలు, SNA SPARSHA కింద ₹1.25 లక్షలు ఖర్చు చేయలేదట. మరోవైపు సిబ్బంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారు. ₹42 లక్షల మేరా జీతభత్యాలకు కేటాయించగా ₹27 లక్షలు ఖర్చు చేశారట. కార్యక్రమాలు జరగకపోయినా జీతాలు తీసుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కొరవడుతోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాలల సంరక్షణకు అమలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు పడకేశాయి. వీటి కోసం గతేడాది ₹3.50 లక్షలు, SNA SPARSHA కింద ₹1.25 లక్షలు ఖర్చు చేయలేదట. మరోవైపు సిబ్బంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారు. ₹42 లక్షల మేరా జీతభత్యాలకు కేటాయించగా ₹27 లక్షలు ఖర్చు చేశారట. కార్యక్రమాలు జరగకపోయినా జీతాలు తీసుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.