India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. నెల్లూరు సిటీలో 2698, ఆత్మకూరులో 2611, సర్వేపల్లిలో 1397, ఉదయగిరిలో 2493, కావలిలో 3235, నెల్లూరు రూరల్లో 4741, కోవూరులో 2838, కందుకూరులో 1908 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు 2150 మంది ఓటు వేశారు.
పోలింగ్ మే 13న జరగనున్న నేపథ్యంలో పోలింగ్కు ముందురోజు, పోలింగ్ జరిగే రోజుల్లో ఈనెల 12, 13 తేదీలలో పత్రికల్లో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ఎంసిఎంసి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని మీడియా సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు.
ఉదయగిరిలో టీడీపీ తరఫున ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం ఉమ్మడి కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యానన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని, అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాళ్లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లతో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కే నాగమల్లేశ్వర్ రెడ్డి సమీక్షించారు. ఉదయగిరిలోని సెబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1989లో పసల పెంచలయ్య(కాంగ్రెస్) S.ప్రకాశం(TDP)పై పోటీ చేసి 1502 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో ఆయన అల్లుడు కిలివేటి సంజీవయ్య(వైసీపీ) పరసా వెంకటరత్నం(టీడీపీ)పై పోటీ చేసి 61,292 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మామ అత్యల్ప మెజార్టీతో గెలవగా.. అల్లుడు అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలను జీపీఎస్ సౌకర్యం ఉన్న వాహనాల్లోనే తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ జిల్లాకు కేటాయించిన శిక్షణ ఐపీఎస్లు నెల్లూరుకు చేరుకున్నారు. వీరిలో మయాంక్ మిశ్రా, సిద్ధార్థ్, రామ్ కుమార్, ప్రతీక్ సింగ్, కుష్ మిశ్రా, సూరజ్, అభినవ్ ద్వివేది, జామా సోనార్, ఆషిమా నాశ్వాణి, అపర్ణ ఉన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓటర్లను రప్పించడానికి ఆయా పార్టీల అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కొందరికి వాహనాలు ఏర్పాటు చేయగా.. మరికొందరికి వారి ఖాతాలోనే నగదు వేసి ఓటు వేయాలని కోరుతున్నారు. మరోవైపు ఓటుకు నోటు ఇవ్వడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. రేపటి నుంచి ఓటర్లకు నగదు ఇవ్వడానికి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 9 నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియతో పాటు ఏ సందేహం ఉన్నా వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉంటుందని నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. నెల్లూరులోని కమాండ్ కంట్రోలు సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఎన్నికల్లో గెలవలేక మాజీ మంత్రి నారాయణ 1200 మంది రౌడీలను దించారని, వారితో పాటు అదనంగా హైదరాబాద్ విజయవాడ నారాయణ సిబ్బంది మొత్తం నెల్లూరులో మోహరింప చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు విజయ్ సాయి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.