Nellore

News January 6, 2025

నెల్లూరు: నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

image

నెల్లూరు జిల్లాలో నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌వే అన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాల్టి (సోమవారం) నుంచి వాటి లెక్కను ప్రభుత్వం తేల్చనుంది. పెద్దాస్పత్రిలోని డాక్టర్ల బృందం ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

News January 6, 2025

భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే: వెంకయ్య నాయుడు 

image

భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల సందర్భంగా ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న 12వ ద్వైవార్షిక మహాసభల రెండో రోజున ఆయన పాల్గొన్నారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడం మనందరి బాధ్యతని, మన భవిష్యత్తు తరాలకు భాషా సంప్రదాయాలు అందించాలన్నారు. ఇంగ్లీషు వ్యామోహం వదిలి తెలుగును బతికించుకోవాలన్నారు.

News January 5, 2025

చిట్టమూరు : మూడేళ్ల పాపపై లైంగిక దాడి 

image

చిట్టమూరు మండలం, ఈశ్వరవాక గిరిజన కాలనీలో డిసెంబర్ 31న మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు శీనయ్యపై శనివారం ఫోక్సో కేసు నమోదు చేసినట్లు గూడూరు డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బయట ఆడుకుంటున్న చిన్న పాపపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. అతనిని కోర్టుకు తరలిస్తామని తెలిపారు.

News January 5, 2025

నెల్లూరు జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన్నెమాల

image

వైసీపీ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిడూరుకు చెందిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అభివృద్ధికి మన్నెమాల ఎంతో కృషి చేసి చేశారని, గ్రామంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడని సన్నిహితులు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పదవినిచ్చినట్లుగా నాయకులు తెలిపారు.

News January 4, 2025

కోరిక తీర్చనందుకే మహిళ హత్య: కావలి DSP

image

కావలిలో ఈ నెల ఒకటో తేదీన అర్పిత బిస్వాస్ అనే మహిళను హత్య చేసిన నౌమౌన్ బిస్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్‌తో కలిసి మందు తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన అర్పితను అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు. 

News January 4, 2025

దగదర్తి ఎయిర్‌పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. గతంలో జిల్లాలో దగదర్తి విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని కార్యాచరణను రూపొందించి 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన 745 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈప్రాంతంలో BPCL చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్‌ను తేవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.

News January 4, 2025

ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి: డీఎంహెచ్ఓ

image

వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పనిచేయాల్సిన వారు అక్కడే పని చేయాలని నెల్లూరు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిప్యూటేషన్లపై విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జీవో నం. 143 ద్వారా డిప్యూటేషన్‌పై ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.

News January 4, 2025

సంగం: హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం సంగం మండలం వెంగారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 4, 2025

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధులు వీరే

image

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధులుగా నేతాజీ సుబ్బారెడ్డి, వీరి చలపతి, ఇర్మియా, ఆర్ఎస్ఆర్, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మేకల శ్రీనివాసులు, ముప్పవరపు కిషోర్, కొడవలూరు భక్తవత్సలరెడ్డి, ఎస్కే కరిముల్లా, నెల్లూరు శివప్రసాద్, మాదాసు యజ్ఞ పవన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

News January 4, 2025

దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం సమీక్ష

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. 635 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం జరగనుండటంతో దగదర్తి ఎయిర్ పోర్టుకు ప్రాధాన్యం పెరిగింది.