India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈసీ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే పోస్టల్బ్యాలెటు ఓట్లు వినియోగించుకోవాలని కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంటుకు, అసెంబ్లీకి రెండు ఓట్లు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మూడో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాణి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో HMలకు నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. మే 30న లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
విడవలూరు మండలం అలగానిపాడుకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూలు వయస్సులోనే స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక కమ్యూనిస్టు పార్టీలో జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. కమ్యూనిస్టు గాంధీగా గుర్తింపు పొందారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో తరించారు. సంతానం కలిగితే ప్రజాసేవకు బంధాలు అడ్డు అనే ఉద్దేశంతో పెళ్లి కాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేడు ఆయన జయంతి.
వైసీపీ కోవూరు MLA అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని కొత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేసినట్లు ఎంపీడీఓ సాయిలహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 115 మంది, పార్లమెంటుకు 14 మంది పోటీ పడుతున్నారని కలెక్టర్ ఎం .హరి నారాయణన్ తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ ఆఫీజ్ మాట్లాడుతూ. జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. శాంతి భద్రతలపై దృష్టి పెడుతామన్నారు.
కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నీట మునిగిన యువకులు పాతలపల్లి గ్రామానికి చెందిన మిట్టమల్ల వంశీ(28), పెంచల నరసింహులు(20) గా గుర్తించారు. వంశీ మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు, పెంచల నరసింహులు మృతదేహం కోసం ఈతగాళ్లు, స్థానికులు, బంధువులు గాలిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసవద్రంలో మునిగి పోయారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముత్తుకూరు రోడ్డులోని పీఎస్ఆర్ కన్వెన్షన్ నుంచి బయలుదేరి వీఆర్సీ మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వీఆర్సీ మైదానంలో జరిగే సభలో పాల్గొన్న అనంతరం 6.30 గంటలకు తిరిగి కన్వెన్షన్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఐదేళ్లలో ఏమి పనిచేయని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను గ్రామాలలో తిరగనివ్వొద్దని, అడ్డుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం చెంబేడుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను, నెలవల, పరసా ఏ గ్రామానికి వెళ్లినా ఏమి అభివృద్ధి చేశామో చెప్పగలనని, కానీ కిలివేటి ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
వడదెబ్బ సోకి మహిళ మృతి చెందిన సంఘటన వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీ బాలాజీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపు పుట్టమ్మ (52) గ్రామ సమీపంలోని వేరుశనగ తోటలో పనిచేస్తున్న తన భర్తకి భోజనం ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎండ తీవ్రతకు అక్కడే కుప్పకూలిపోయారు. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
మేమందరం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితోనే ఉంటామని ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట వైసీపీ నేత కదురు రమేశ్ అన్నారు. నిన్న కొంతమంది డేవిస్ పేట నుంచి టీడీపీలో చేరారు. కదురు రమేష్ అనుచరులు కూడా టీడీపీలో చేరారని, ఆయన ఒంటరిగా మిగిలిపోయారని వార్తలు వచ్చాయి. ఇవ్వన్ని అపోహలేనని, మేమంతా వైసీపీలోనే ఉన్నామని వారు స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.