India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మరో 4 సహకార బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయని సొసైటీ CEO శ్రీనివాసరావు Way2Newsతో తెలిపారు. ఇప్పటికే 23 ఉండగా నూతనంగా 4 బ్యాంకులను ఇందుకూరుపేట, నెల్లూరు(R)లో కాకుపల్లి, కొత్తూరు, డక్కిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తామని వెల్లడించారు. తమ బ్యాంకు పరిధిలో ఈ ఏడాది రూ.2900 కోట్ల వ్యాపార లక్ష్యానికి రూ.2250 కోట్లకు చేరువయ్యామని తెలిపారు.

సూక్ష్మ సేద్య పథకం కింద అందాల్సిన డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు రైతుల దరిచేరడంలో నీరుగారుతున్నాయి. నెల్లూరు జిల్లాకు 6 వేల హెక్టర్లకు రాయితీపై మంజూరు చేయాల్సి ఉండగా.. 2314.82 హెక్టర్లకు 1767 మంది రైతులకు అందజేశారు. గతేడాది సైతం 5 వేల హెక్టర్లకు 4553 హెక్టార్లకు 3700 మందికి ఈ యూనిట్లను ఇచ్చారు. కాగా మరో 2 నెలల్లో ఆర్ధిక ఏడాది ముగుస్తున్నా.. లక్ష్యాలను సాధించకపోవడం APMIP శాఖ పనితీరు అద్దం పడుతోంది.

సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా 2025-26 మార్చి కల్లా రూ.2,250 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, రూ.2,050 కోట్ల రుణాలను 37,039 మంది రైతులకు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద వరికి రూ.52 వేలు, మిర్చి రూ.1.50 లక్షలు, పసుపు రూ.1.15-1.25 లక్షలు, నిమ్మ రూ.75- 85 వేలు, అరటి రూ.1.10 లక్షలు, చేపలు, రొయ్యలు రూ.3.75 – 4.07 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మరో 2 నెలలు గడువుకి రూ.200 కోట్ల రుణాలకు అవకాశం ఉంది.

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు.

నెల్లూరు జిల్లా చెముడుగుంటలోని డీటీసీలో సంక్రాతి వేడుకలు నిర్వహించారు. ట్రైనీ కానిస్టేబుళ్లతో కలిసి ఎస్పీ అజిత వేజెండ్ల భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. నిత్యం శిక్షణలతో కనిపించే డీటీసీ మైదానం పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. ఆ తరహాలో ప్రత్యేకంగా అలంకరించారు. అరిసెలు, ఉప్పు చెక్కలు వంటి పిండి వంటకాలు చేసి పంచి పెట్టారు.

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.

నెల్లూరు జిల్లాలో చైనా మాంజా వాడకాన్ని నిషేధిస్తున్నామని ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల వెల్లడించారు. ‘సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. అందరూ సంతోషంగా పతంగులు ఎగరవేయాలి. చైనా మాంజా(దారం) వాడకంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారాలు అమ్మడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఆ మాంజాను విక్రయిస్తే 100కు డయల్ చేయండి’ అని ఎస్పీ కోరారు.

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, అందులో పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. ఎక్కడైనా కోడి పందెం, జూద శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని ఆమె కోరారు.

అనంతసాగరం లింగంగుట్టలో 2022లో రీసర్వే చేసి 1B భూములను చుక్కల భూములుగా తేల్చారు. 114మందికి చెందిన భూములను ఒకే వ్యక్తి కిందకు చేర్చారు. బాధితులకు 1బీ అడంగల్ అందక, రిజిస్ట్రేషన్లు జరగక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నెల్లూరులో సోమవారం JCకి అర్జీ ఇవ్వగా.. వీటిని MRO, RDO లాగిన్లోనే చేయాలని చెప్పారు. MRO, RDOలకు ఈ అంశంలో ఫుల్ పవర్స్ ఇచ్చినా బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.