India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజతో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి పూజ భేటీ అయ్యారు. కమిషనర్కు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరిపాలనపరమైన అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

గుంటూరు జోన్ పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నెల్లూరు DMHO V.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జోన్ పరిధిలో మొత్తం 44 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 సా.5 గంటల లోగా http://cfw.ap.nic.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాజ్యసభ సభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీద మస్తాన్ రావుకు నెల్లూరు జిల్లా యాదవ సంఘం, యాదవ ఎంప్లాయిస్ అఫీషియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరానన్నారు. వైసీపీ ఓడిపోవడంతో తాను రాజ్యసభకు రాజీనామా చేసి హుందాగా వ్యవహరించానని అన్నారు.

నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి పాఠశాలలో ఏడు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. SGT-2, SA గణితం-2, హిందీ-1, బయాలజికల్ సైన్స్-1, ఫిజికల్ సైన్స్-1 మొత్తం 7 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ పోస్టులను డైరెక్ట్ నియామకం ద్వారా భర్తీ చేస్తున్నామని అన్నారు.

తొలికారు వరిసాగు నేపథ్యంలో నెల్లూరులో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యూరియా కొరత విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణయ్య నాయుడు అగ్రికల్చర్ జేడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో గురువారం ఒక వ్యాగన్(2700 టన్నులు)లో యూరియా రాగా, మరో రెండు వ్యాగన్లు మార్గమధ్యలో ఉన్నాయి.

కావలిలో ఓ మహిళ <<15037512>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. కోల్కతాకు చెందిన అర్పిత బిస్వాస్(24) కుటుంబం కావలిలో ఓ చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. వారి బంధువు నయాన్ అనే యువకుడిని హెల్పర్గా పెట్టుకుని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే నయాన్ యజమానిపై కన్నేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా అర్పితను ఒప్పించి ఇద్దరూ మద్యం తాగారు. మత్తులోకి జారుకోగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కావలి గాయత్రీ నగర్లోని ఓ ఇంట్లో అర్పిత బిస్వాస్ (24) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ ఏడాది క్రితం నుంచి కావలిలో ఓ క్లినిక్ నడుపుతోంది. అక్కడే పనిచేసే యువకుడు హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సూర్యతేజ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ విభాగం సూపరింటెండెంట్ సిద్ధిక్ను మేయర్ పేషీకి, ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యంను హౌసింగ్ ఇన్ఛార్జిగా, లీగల్ సెల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ను ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి బదిలీ చేశారు.

వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు, ఆత్మకూరు, రాపూరు ఆస్పత్రుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉంది. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్
➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్
➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ
➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ
➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్
Sorry, no posts matched your criteria.