India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలని నెల్లూరు కలెక్టర్ ఎం.హరినారాయణన్ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నోడల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెక్పోస్ట్ల వద్ద పక్కాగా తనిఖీలు చేయాలని సూచించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ దర్శనానికి వెళ్లకుండా ఉంటే పదవి పోతుందనే నమ్మకం ఉంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆలయం దారిగుండా కారులో వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. మరో ప్రధాని ఐకే గుజ్రాల్ శ్రీహరికోటకు వచ్చినా అమ్మవారిని దర్శించుకోలేదు. 1998లో ఆయన పదవిని కోల్పోయారు. తమిళనాడు సీఎం జయలలిత, ఎన్టీఆర్కు కూడా ఇలాగే పదవీగండం కలిగిందని స్థానికులు చెబుతారు.
నెల్లూరుకు చెందిన ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ చౌదరి చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించాడు. 2022 ఫిబ్రవరి 21న రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో 64 మందికి రూ.6.4 కోట్లు బకాయి ఉన్నట్లు తేలింది. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఆయనకు తొమ్మిదేళ్ల జైలుశిక్ష, రూ.1.55 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి భీమారావు తీర్పుచెప్పారు.
పింఛన్ లబ్ధిదారులకు నగదును బ్యాంకు ఖాతాల్లో బుధవారం జమ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో 3,15,423 మంది లబ్ధిదారులకు రూ.94.38 కోట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆధార్ నంబరుతో మ్యాప్ అయిన అకౌంట్కు నగదు జమ చేస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లేని వారు, దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి ఐదో తేదీ లోపు ఇంటి వద్దే పంపిణీ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మే 5న నెల్లూరుకు రానున్నారు. ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు చర్చించారు. నెల్లూరులో ఆమె రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్గాలకు సూచించారు.
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలిలో జనసేన అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో నిలిచారు. అప్పుడు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన ఆయనకు 10,647(5.46శాతం) ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కావలిలో జనసేన అభ్యర్థి లేకపోవడంతో పసుపులేటికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మరి ఈసారి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
నెల్లూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. కావలిలో పసుపులేటి సుధాకర్, సర్వేపల్లిలో మన్నెం పుట్టయ్య, ఆత్మకూరులో ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గాజు గ్లాసు గుర్తు లభించింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.
2024 సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. సోమవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ లో అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్, బుజబుజ నెల్లూరు చెక్ పోస్ట్ లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హాఫిజ్ సోమవారం తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్ పోస్టులు, ముఖ్య కూడళ్లలో వద్ద సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అక్రమ రవాణా లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.