Nellore

News April 27, 2024

నెల్లూరు : కోటంరెడ్డి ఇంటికి బాలకృష్ణ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆదిత్య నగర్ లోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం బాలకృష్ణను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రాజకీయాలపై చర్చించారు.

News April 27, 2024

ఆత్మకూరు: బాలింత మృతిపై వివాదం

image

ఆత్మకూరు వైద్యశాలలో బాలింత మృతిపై వివాదం నెలకొంది. అనంతసాగరం మండలం రేవూరుకి చెందిన భవాని రెండో కాన్పు కోసం రెండు రోజుల క్రితం వైద్యశాలలో చేరారు. శుక్రవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి నొప్పులు అధికంగా ఉన్నాయనడంలో వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చారు. ఒక్కసారిగా పెదవి పక్కకు లాగి నూరుగు వచ్చింది. అత్యవసర వార్డుకు తరలించి సేవలందించారు. అయినా యువతి కోలుకోలేక మృతి చెందింది.

News April 27, 2024

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు తిరస్కరణ

image

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు సక్రమంగా లేని 41 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కావలి నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించారు. కోవూరులో 9, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 8, ఉదయగిరిలో ఆరు సర్వేపల్లిలో నాలుగు, ఆత్మకూరులో రెండు, కందుకూరు, నెల్లూరు రూరల్‌లో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.

News April 26, 2024

నెల్లూరు: చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించే ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు.. 3.30 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బుచ్చిలో జరిగే సభకు హాజరవుతారు. రాత్రికి బుచ్చిలోనే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తెలిపాయి.

News April 26, 2024

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక

image

ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టీడీపీ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. ఆమెను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 2019, 2021 ఉప ఎన్నికలో ఆమె టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు లేదా తన భర్తకు ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఆశించారు. ఇవేమీ దక్కకపోవడంతో పార్టీ పదవి కట్టబెట్టారు.

News April 26, 2024

రూ.9500 పలికిన నిమ్మకాయల బస్తా

image

పొదలకూరు మార్కెట్లో శుక్రవారం నాణ్యమైన నిమ్మకాయలు బస్తా రూ.9.500 పలికాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు బస్తా రూ.4 వేలు నుంచి రూ.5 వేలు పలుకుతూ వచ్చింది. మంగళవారం ఆరు వేలకు చేరగా, గురువారం రూ.8 వేలు పలికింది. శుక్రవారం మరో రూ.1500 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News April 26, 2024

నెల్లూరు: 283 సెట్ల నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి 21 మంది 36 నామ పత్రాలు సమర్పించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 39 సెట్లు, రూరల్ 28, సర్వేపల్లి 23, కందుకూరు 40, కావలి 43, ఆత్మకూరు 27, ఉదయగిరిలో 41 నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 26, 2024

బిట్రగుంట: మెము రైళ్లు రద్దు పొడిగింపు

image

పలు మెము రైళ్లు రద్దు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిట్రగుంట-విజయవాడరైలు 29 నుంచి మే 26 వరకు, విజయవాడ-బిట్రగుంట రైలు 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-చెన్నై రైలు 29 నుంచి మే 3 వరకు, మే 6 నుంచి 10 వరకు, 13 నుంచి 17 వరకు, మే 20 నుంచి 24 వరకు రద్దు చేశారు.

News April 26, 2024

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. వాలీబాల్‌లో గాలి తగ్గిందని 12 ఏళ్ల బాలుడు ఓ చోటకు వెళ్లాడు. అక్కడ అనికేపల్లికి చెందిన రాజా అనే వ్యక్తి సైకిల్ పంపు ద్వారా బాలుడి మలరంధ్రాల్లో గాలి కొట్టాడు. దీంతో అతని పొట్ట ఉబ్బిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా రాజాపై పోక్సో కేసు నమోదు చేశారు.

News April 26, 2024

నెల్లూరు: చివరి రోజు 113 సెట్ల నామినేషన్లు

image

నెల్లూరు జిల్లాలో చివరి రోజు గురువారం మొత్తం 113 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కందుకూరు 14, కావలి 8, ఆత్మకూరు 7, కోవూరు 24, నెల్లూరు నగరం 16, నెల్లూరు గ్రామీణం 8, సర్వేపల్లి 7, ఉదయగిరిలో 14 మంది నామినేషన్ వేశారు. నేడు వీటిని పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.