India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కొప్పాల రఘు నామినేషన్ వేశారు. అఫిడవిట్ ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి ఆయనే కావడం విశేషం. రఘుకి సొంత ఇల్లు, కారు, వ్యవసాయ భూమి, బంగారు ఆభరణాలు లేవు. చర, స్థిర ఆస్తులు ఏమీ లేవు. సెకండ్ హ్యాండ్ బైకు ఉంది. SBI బ్యాంక్ బ్యాలెన్స్ రూ.500. ఆయన భార్య కొప్పాల రేవతి పేరుపై కూడా చర, స్థిర ఆస్తులు లేవు. రఘుపై ఓ సోషల్ మీడియా కేసు ఉంది.
సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన తొలిరోజే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరుకు చేరుకుంటారు. సభ ప్రాంగణం వివరాలు తెలియాల్సి ఉంది.
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఓ పోలీస్ కేసు నమోదైంది.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నామని నెల్లూరు కలెక్టర్ హరి నారాయణన్ వివరించారు. స్థానిక ఎన్నికల కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యయ పరిశీలకులు, సాధారణ పరిశీలకులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో 79శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 85 శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నెల్లూరు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతరావు ఎన్నికల బరిలోకి దిగారు. సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఉదయగిరి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా అత్యంత సామాన్యుడు, 73 ఏళ్ల వృద్ధుడు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేశ్ ప్రేమ్ కుమార్కు అందజేశారు. ఆయన వింజమూరు మండలం నల్గొండ గ్రామానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలోని అన్ని మండల ప్రధాన కేంద్రాలు వద్ద రెవిన్యూ సమస్యల గురించి చేతిలో మైకు పట్టుకుని స్వచ్ఛందంగా మాట్లాడుతూ అందరికీ సుపరిచితమైన వ్యక్తిగా గుర్తింపు ఉంది.
నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూలు మైదానం, ఏసీ సుబ్బారెడ్డి పార్కుల్లో గురువారం ఉదయం వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో పోలీసు, సెబ్ అధికారులు బుధవారం భారీగా మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ.2 లక్షలు, సంతపేటలో రూ.92వేలు, కోవూరు రూ.2 లక్షలు, కావలి పట్టణం రూ. 5 లక్షలు, సంగం రూ.1.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దగదర్తిలో 42 మద్యం సీసాలు, సైదాపురంలో 10, బిట్రగుంటలో 35, కృష్ణపట్నం పోర్టులో 21, జలదంకిలో 8, కలిగిరిలో 11, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ నంబరు 91001 21702 ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.11.03 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. సోమిరెడ్డి పేరున రూ.62 లక్షలు చర, రూ.9.18 స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆయన భార్య జ్యోతి పేరున రూ.1.22 కోట్ల చరాస్తులు ఉన్నాయి. సోమిరెడ్డిపై మొత్తం 17 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.