Nellore

News April 25, 2024

నెల్లూరు: ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

image

ఎన్నికల నేపథ్యంలో మే 13న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాల్లో పనిచేసే అర్హులైన రోజు వారి, సాధారణ, షిఫ్టుల వారి కార్మికులు ఓటు వినియోగించుకోవడానికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు కార్మిక ఉప కమిషనర్ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

News April 25, 2024

నెల్లూరు: 47 మంది నామినేషన్ల దాఖలు

image

నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఆరోరోజు బుధవారం పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీకి 41 మంది అభ్యర్థులు 48 సెట్లు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆరుగురు అభ్యర్థులు 7 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

News April 25, 2024

కావలి: సచివాలయ ఉద్యోగి సస్పెండ్

image

కావలి పట్టణం బుడంగుంటలోని 15వ వార్డు సచివాలయ అడ్మిన్ పెంచల బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. సచివాలయ తాళాలు ఉండే సదరు ఉద్యోగిని ఇందుకు బాధ్యుడిగా చేస్తూ సస్పెండ్ చేశారు. విచారణ ముగిసి తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇది కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.

News April 25, 2024

ఆత్మకూరు: మాజీ ఎంపీ మేకపాటిపై కేసు నమోదు

image

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఎన్నికల నియమావళి అతిక్రమణ కేసు నమోదైంది. ఈ కేసును ఈ నెల 22న నమోదు చేయగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న మర్రిపాడు మండలం అల్లంపాడులో రచ్చబండ జరిగింది. ఈ కార్యక్రమంలో మేకపాటి ఆత్మకూరు ఛైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మపై ఎన్నికల నియమావళిని అతిక్రమించి.. అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా కేసు నమోదైంది.

News April 25, 2024

నెల్లూరు: మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు

image

మే నెల 2 నుంచి 8వ తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. ఇందుకు సంబంధించి నగర పాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో నోడల్ అధికారులు, ఆర్వోలతో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సంజనా సింహా, డీఆర్వో లవన్న తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

నెల్లూరులో ప్రచారానికి బాలయ్య రాక

image

టీడీపీకి మద్దతుగా హీరో బాలకృష్ణ ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన తొలివిడత స్వర్ణాంధ్ర సాకార యాత్ర పూర్తి అయ్యింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కందుకూరులో సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రూరల్, సిటీ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు.

News April 25, 2024

జనసేన నేత బొబ్బేపల్లిపై తిరుగుబాటు

image

జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడిపై ఆ పార్టీకి చెందిన 5 మండలాల అధ్యక్షులు తిరుగుబాటుకు దిగారు. వెంకటాచలంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే జన సైనికులపై ఆయన దూషణలకు దిగడం సరికాదన్నారు. ఆయన తీరు నచ్చకే కొందరు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారన్నారు. అతనితో కలిసి పనిచేయబోమని.. తామంతా సోమిరెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు.

News April 25, 2024

జిల్లా పోలీస్ అబ్జర్వర్‌గా అశోక్ టి.దుధే

image

ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చునని పోలీస్ అబ్జర్వర్ అశోక్ టి.దుధే ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పోలీసు పరిశీలకులుగా ఆయన నియమితులయ్యారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని గెస్ట్ హౌస్‌లో ఆయన అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో 7569618685, policeobserver73@gmail.com ద్వారా ఆయన్ను సంప్రదించవచ్చు.

News April 25, 2024

నెల్లూరు: ఇటీవల టీడీపీలో … నేడు వైసీపీలో చేరిక

image

ఇటీవల టీడీపీలోకి వెళ్లిన మత్స్యకార నాయకుడు, కావలి రూరల్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు సోమయ్యగారి రాంబాబు తిరిగి వైసీపీలో చేరారు. నెల్లూరులో ఇవాళ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు రాంబాబుకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

News April 25, 2024

ఐదో రోజు మొత్తం 36 మంది నామినేషన్లు

image

2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఐదో రోజు మంగళవారం పలు రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 మంది అభ్యర్థులు 44 సెట్లు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.