India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇదే రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్న ఆయనకు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో రేపు చంద్రబాబు పర్యటన సాగనుంది.
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు MP అభ్యర్థిగా ఏఐసీసీ నేత కొప్పుల రాజు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్గా వ్యవహరించారు. అప్పుడు ఆయన పని చేసిన కార్యాలయంలో.. అదే సీటులో ఉన్న ప్రస్తుత కలెక్టర్కు రాజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పేపర్లు ఇవ్వడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు MP అభ్యర్థిగా ఏఐసీసీ నేత కొప్పుల రాజు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్గా కొప్పుల రాజు పనిచేసిన విషయం తెలిసిందే. అనేక ఉద్యమాలకు ఆయన అండగా నిలిచారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడూరు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు మర్రిపల్లిలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.30 గంటల వరకు గేటు సెంటర్ లో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు మర్రిపల్లి హెలిపాడ్ నుంచి సత్యవేడుకు బయలుదేరుతారు.
➤ నియోజకవర్గం: వెంకటగిరి
➤ అభ్యర్థి: నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (YCP)
➤ ఆస్తుల విలువ: రూ.52.96 కోట్లు
➤ భార్య స్వప్న ఆస్తి: రూ.12.28 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.18 లక్షలు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.2.40 లక్షలు
➤ బంగారం: లేదు, భార్యకు 1.86 కేజీలు
➤ వాహనాలు: రెండు కార్లు
NOTE: HYD సోమాజిగూడలోని ఓ ఇల్లు విలువే రూ.17.50 కోట్లుగా తన అఫిడవిట్లో చూపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరుకు వెళ్తున్న కారు వెంగమాంబపురం సమీపంలోని పచ్చారుచేను వద్ద అదుపు తప్పింది. ఒక ఇంటి ప్రహరీ ఢీకొట్టింది. గోడ అవతలకు వెళ్లడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మార్పు విషయంలో ఆపార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సీటును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆశించారు. అధిష్ఠానం మాత్రం ఆయన కుమార్తె లక్ష్మీసాయి ప్రియ వైపు మొగ్గుచూపింది. కానీ రామకృష్ణకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఉండటంతో తిరిగి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలనే యోచనతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిన్న నామినేషన్ వేశారు. ఈక్రమంలో తమ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. ఇందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట రూ.639.26 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లని చెప్పారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రశాంతిపై ఎలాంటి కేసులు లేవు.
24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఎన్నికలకు పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్- 9440796385, 9392903413, 0861-2328400 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ
K.ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు .
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.