Nellore

News April 11, 2024

నెల్లూరు: ఎన్నికల పరిశీలకుల నియామకం 

image

జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులను నియమించింది. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు నితిన్ సింగ్ బదారియా , కందుకూరు, కావలి, ఉదయగిరికి రామ్ కుమార్ గౌతమ్, సర్వేపల్లికి కరీ గౌడ్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. పోలీస్ పరిశీలకులుగా కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరికి అశోక్ టి దూదే , సర్వేపల్లికి అరవింద్ సాల్వే ను నియమించింది.

News April 11, 2024

NLR: ‘జనసేనకు పట్టిన దరిద్రం పోయింది’

image

నెల్లూరు జిల్లాలో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీ నాయకులు కలవడంతో సంబరాలు చేసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి జనసేనను వీడితే తమకు సంతోషమేనని.. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.

News April 11, 2024

నెల్లూరు జిల్లాలో 20.48 లక్షల మంది ఓటర్లు

image

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 20,48,252 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. వీరిలో 10,02,144 మంది పురుషులు, 10,45,917 మంది మహిళలు, 211 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించగా 7,932 పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు.

News April 11, 2024

నెల్లూరు: ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన తల్లి

image

ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం రాత్రి బెంగళూరు జాలహళ్లిలో పరిధిలో జరిగింది. నెల్లూరుజిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన గంగాదేవి తన ఇద్దరు పిల్లలు లక్ష్మీ (9), గౌతమ్(7)తో కలిసి బెంగళూరులో ఉంటోంది. నిద్ర పోతున్న బిడ్డల ముఖాలపై దిండు వేసి అదిమిపెట్టి హత్య చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి.. తప్పు ఒప్పుకుంది. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 10, 2024

మనుక్రాంత్ ఎక్కడ..?

image

జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి కొద్ది రోజులుగా రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా జిల్లాలో జనసేనకు ఎక్కడా పోటీ చేసే అవకాశం లభించలేదు. మొదట్లో కూటమికి సంబంధించిన కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ ఇటీవల ప్రచారంలో ఎక్కడా ఆయన ఊసే లేదు. ఈక్రమంలో ఆయన రాజకీయ కార్యాచరణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

News April 10, 2024

30 నెలల్లో నెల్లూరు ఎయిర్‌పోర్ట్ కడతాం: VSR

image

నెల్లూరు జిల్లా ఎయిర్‌పోర్ట్ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి(VSR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు దగాకోరు హామీల్లో నెల్లూరు ఎయిర్ పోర్టు ఒకటి. 2018లో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేస్తామని నమ్మబలికారు. నేను ప్రామిస్ చేస్తున్నా. జగన్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎయిర్‌పోర్టు పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News April 10, 2024

కోవూరులో 29 మంది వాలంటీర్లు రాజీనామా

image

కోవూరులో పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. కోవూరు సచివాలయం-2 పరిధిలో పనిచేస్తున్న 29 మంది తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం అధికారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కుట్రలకు నిరసనగా తాము రాజీనామా చేశామన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకున్న తరువాత విధులలో చేరుతామని తెలిపారు.

News April 10, 2024

కావలిలో ‘ఓటరు సెల్ఫీ’ బూత్ ప్రారంభం

image

కావలి రెవెన్యూ కార్యాలయంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్‌ను కావలి రిటర్నింగ్ అధికారి శీనానాయక్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధృడమైన ప్రజాస్వామ్యం కోసం తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

News April 10, 2024

నెల్లూరు: 20 రోజుల్లో 981 మంది వాలంటీర్లు రాజీనామా

image

నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 20 రోజుల్లో దాదాపు 981 మంది రాజీనామా చేయగా… ఇంకా వందల సంఖ్యలో రాజీనామాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13 వేల మంది వాలంటీర్లు ఉండగా.. వారిలో దాదాపు పదిశాతం మంది రాజీనామాలు చేశారు. కావలి, కోవూరు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

News April 10, 2024

నెల్లూరు కలెక్టర్‌కే ఎంపీ టికెట్

image

ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్‌గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్‌కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.