India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న నగరవనాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నగరవనాన్ని దేశంలోనే నెంబర్ 1 నగరవనంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. నెల్లూరు ప్రజలు కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా గడిపే విధంగా ఈ నగరవనాన్ని రూపుదిద్దుతామని ఆయన తెలిపారు.
నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని శనివారం గుర్తు తెలియన మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక వైపు కుళ్లిన శవం ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. కుళ్లినస్థితిలో ఉన్న మృతదేహాన్ని పేషెంట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఓజిలి మండలం 16వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. మండల కేంద్రమైన ఓజిలి బీసీ కాలనీకి చెందిన గోనుపల్లి రవి (35) అనే వ్యక్తి రాజుపాలెం పెట్రోల్ బంకు వైపు వెళుతుండగా రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి మృతితో బీసీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద నెల్లూరు రూరల్ DSP <<13930649>>వాహనాన్ని ఢీకొట్టి<<>> వెళ్లిపోయిన నిందితుడు డీసీపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆత్మకూరు CIకి పట్టుబడిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లర్గా అనుమానిస్తున్న అతనిని పోలీసులు విచారించగా..రాజమండ్రి సమీపంలోని రాజానగరానికి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు. పట్టుబడిన బొలెరోలో ఎలాంటి గంజాయి లభించకపోవడంతో మార్గమధ్యంలో గంజాయిని దించేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అర్ధరాత్రి వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద నెల్లూరు రూరల్ డీఎస్పీని ఢీకొట్టి ఓ వాహనం పరారైన విషయం తెలిసిందే. నిందితుడిని ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్రిపాడు మండలం డీసీ ప్లాజా దగ్గరలోని కోనసముద్రం వద్ద ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో సీఐ వాహనం పొలాల్లోకి దూసుకెళ్లగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు గంజాయి స్మగ్లర్ అని తెలుస్తోంది.
EVM ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. సంబంధిత కాపీలు జైలుకు అందకపోవడంతో ఆయన నిన్న విడుదల కాలేదు. మరికాసేపట్లో ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అనిల్, కాకాణి జైలు వద్దకు చేరుకున్నారు. బయటకు వచ్చే పిన్నెల్లిని మరో కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది.
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు పోలీసులను ఓ వాహనం ఢీకొట్టింది. గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాలతో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు వాహనాలు చెక్ చేశారు. ఈక్రమంలో వేగంగా వచ్చిన ఓ వాహనం పోలీసులను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీఎస్పీ శ్రీనివాసరావు గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు కడప సెంట్రల్ జైలుకు బదిలీ అయ్యారు. నెల్లూరు ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్గా ఉన్న రాజారావుకు స్థానిక సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించారు. అలాగే కడప సెంట్రల్ జైల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రకాశ్ను ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్గా నియమిస్తూ జైళ్ల శాఖ డీఐజీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ రూ.10 కాయిన్ను కొన్ని చోట్ల తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ వీటిని తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు స్పందించారు. ‘ఆర్టీసీలో రూ.10 కాయిన్ చెల్లుతుంది. ప్రయాణికులు ఇచ్చే కాయిన్ తీసుకోవాల్సిందేనని సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాం. రూ.10 కాయిన్ చెల్లుతుందని బస్టాండ్ ఆవరణలో నోటీసు బోర్డు పెట్టాం’ అని తెలిపారు.
భార్య అసభ్యకర ఫొటోలు భర్తకు పంపిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజా 28 ఏళ్ల వివాహిత అసభ్యకర చిత్రాలను ఆమె భర్తకు గత మార్చి నుంచి వాట్సప్ చేస్తున్నాడు. దీంతో భార్యను భర్త శారీరకంగా వేధించాడు. చివరకు ఆ ఫోన్ నంబర్ను పరిశీలిస్తే రాజానే ఇలా చేస్తున్నాడని తెలిసి గ్రామ పెద్దలు మందలించారు. రాజా ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.