India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కీలకమైన గూడూరు బస్టాండ్ ప్రయాణికుల పాలిట దిన దిన గండంగా మారింది. ప్రయాణికులు వేచి చోట ఉండే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. కమ్ములు బయటపడి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. RTC ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.

నెల్లూరు జిల్లా గుడ్లూరు(M) రాళ్లపాడు సమీపంలో కారు ఢీకొని ఒకరు <<17897415>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఇది పక్కా హత్య అని సమాచారం. దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి(26) మరో ఇద్దరితో కలిసి బైకుపై కందుకూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి కారుతో వచ్చి బైకును ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని సమాచారం. నిందితుతు, మృతుడి మధ్య ఆర్థిక, వివాహేతర విషయమై మధ్య విభేదాలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

అధికారులు ఎవరైనా TDP నాయకుల మాటలు విని పథకాలు ఆపితే తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ‘నావూరుపల్లికి చెందిన చొప్ప రాజమ్మ పెన్షన్ నిలిపివేతపై హైకోర్టుకు వెళ్లాం. బకాయిలతో సహా పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఇచ్చారు. సర్వేపల్లిలో సర్వం దోపిడిమయం. అభివృద్ధి, సంక్షేమ జాడే కనిపించడం లేదు’ అని ఆయన విమర్శించారు.

ఉలవపాడు ఎస్ఐ అంకమ్మ వ్యవహారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్(NHRC) చెంతకు చేరింది. జూలై 26న అర్ధరాత్రి కరేడు రామకృష్ణాపురం STకాలనీకి చెందిన ముగ్గురు మహిళలను చట్ట విరుద్దంగా SI అంకమ్మ అరెస్ట్ చేశారని NHRCకి ఫిర్యాదు అందింది. గిరిజన కాలనీకి చెందిన కత్తి శిరీష ఫిర్యాదుపై స్పందించిన కమీషన్ చర్యలు తీసుకున్న నివేదికను 4 వారాల్లోగా సమర్పించాలని SPని ఆదేశించింది. NHRCఛైర్మన్గా సుప్రీం కోర్టు జడ్జి ఉంటారు.

గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారిలో వెళ్తున్న బైక్ను కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్లో ముగ్గురు తీవ్ర గాయాలపాలవ్వగా, మరొకరు అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆయుధాలకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కనకదుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని కొనియాడారు.

NMC లో దసరా చందాకు తెరలేపారు. ప్రజారోగ్య విభాగంలో కొంతమంది విజిలెన్స్ అధికారుల పేరు చెప్పి సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు సమాచారం. శానిటరీ సూపర్వైజర్లు దందా చేసినట్లు తెలిసింది. ట్రేడ్ లైసెన్స్లు వ్యవహారం అంటూ.. అధికారుల పేరు చెప్పడంతో కార్యదర్సులు చందాను ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ. 2 వేలు వరకు వసూలు చేశారని కొంతమంది వాపోతున్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ప్రభుత్వ భూముల్లో అనుమతి పత్రాలు లేకుండా 12,734 మంది రైతులు 16,836.84 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రెవెన్యూ నుంచి NOC లేకుండా ఈతంతు సాగుతోంది. రీసర్వే జరగని కారణంగా 8678.56 ఎకరాలకు చెందిన 4174 మంది తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి LPM నంబర్లు తప్పనిసరిగా ఉంది. మరోవైపు ఈనెల 20వ తేదీలోగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్లు పొందాలని ఫిషరీస్ JD శాంతి తెలిపారు. దీంతో విద్యుత్ రాయితీలు పొందవచ్చన్నారు.

అమెరికా టారిఫ్స్ తో జిల్లాలో కుదేలైన అక్వా రంగంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రొయ్య సాగు రైతుల్లో ఏర్పడిన అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతుంది. రొయ్యల ఎగుమతుల ప్రత్యామ్నాయాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో 10% ఉన్న రష్యా ఆర్డర్ 40% పెరిగిందని సమాచారం. తాజాగా యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం కూడా రైతులలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఎగుమతిదారులు చెబుతున్నారు.

ఎన్నికల వేళ విద్యుత్తు బిల్లులు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకున్నారు. తాజాగా ట్రూ డౌన్ సమీక్షలో జిల్లా వినియోగదారులపై రూ.32 కోట్లు భారం తగ్గనుంది. జిల్లాలో 12,37,429 కనెక్షన్లు ఉండగా రోజుకు సుమారు 13 మిలియన్ యూనిట్లు వినియోగమవుతున్నాయి. గతంలో యూనిట్కు అదనంగా 40 పైసలు వసూలు చేసిన చోట, ఇకపై 13 పైసలు తగ్గింపు లభించనుంది. నవంబరు బిల్లుల నుంచే అమలు జరగనుందని SE కే.రాఘవేంద్ర తెలిపారు.
Sorry, no posts matched your criteria.