India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలో గత 4 నెలల్లో 320.4 MM సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 254.2 MM వర్షపాతం నమోదై -20.7 MM లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలోని 22 మండలాల్లో లోటు వర్షపాతం, 13 మండలాల్లో సాధారణం, కోవూరు, విడవలూరు, వెంకటాచలం మండలాల్లో మాత్రమే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఈఏడాదిలో ఇప్పటివరకు 1052.9 MM వర్షపాతం కురవాల్సి ఉండగా.. 1170.3 MM నమోదై వర్షభావం నుంచి బయట పడినట్టయింది.

క్రీడల్లో రాణించాలంటే శిక్షణ అవసరం. అందుకు అకాడమీలు ఉండాలి. అయితే జిల్లాకు ప్రధాన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకాడమీలు లేక వెలవెలబోతోంది. బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, ఖోఖో, హ్యాండ్ బాల్, వాలీబాల్ క్రీడలకు అకాడమీలు ఉండేవి. ఇవి కాస్త ప్రస్తుతం మూత పడ్డాయి. వీటిని అందుబాటులోకి తీసుకొస్తే క్రీడాకారులకు ప్రయోజనంగా ఉంటాయి. ఈ ప్రభుత్వంలోనైనా వాటిని మంజూరు చేస్తారేమో చూడాలి.

GST 2.0 ఫలాలు ప్రజలందరికీ అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ‘సూపర్ GST.. సూపర్ సేవింగ్స్’పై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. GST తగ్గింపు వలన 90 శాతం వస్తువులు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో మందుల ధరలు తగ్గినట్లు జిల్లా వైద్యాధికారిని సుజాత తెలిపారు. అత్యవసరం మందులు, పరికరాలపై 12 శాతం జీఎస్టీ తగ్గిందన్నారు. శిశువులకు ఉపయోగించే నాప్తిన్లు, లైనర్లు, ఫీడింగ్ బాటిల్లు, ఆరోగ్య బీమాపై పూర్తిగా జీఎస్టీ తొలగించారని తెలిపారు. జీఎస్టీ ద్వారా తగ్గిన వస్తువులపై ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.

చేపలు బరువు పెరడగానికి 6-8 నెలలు పడుతుంది. అయితే <<17872074>>చికెన్ వేస్ట్<<>> ఫీడింగ్తో అవి కేవలం నాలుగు నెలల్లోనే బరువు పెరుగుతాయి. ఇదే రైతులకు వరంగా మారింది. జిల్లాలో 80 శాతం మంది రైతులు చేపల కోసం దీనినే వాడుతున్నారట. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొని ఇక్కడ వాడుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకున్న చేపలను మనుషులు తింటే క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

నెల్లూరు జిల్లాలో చికెన్ వేస్ట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. MLA ప్రశాంతి రెడ్డిసహా ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్నింగ్ ఇచ్చినా అక్రమార్కులు డోంట్ కేర్ అంటున్నారు. బుచ్చి, కోవూరు, సంగం వంటి ప్రాంతాలలో అధికారులు దాడులు చేస్తున్నా ఫలితం శూన్యం. జిల్లాలో నెలకు రూ.10 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. మరోవైపు దీనిపై అటు కూటమి నేతలు, ఇటు వైసీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో TDP అడ్రస్ గల్లంతవడం ఖాయమని వైసీపీ నేత కాకాణి అన్నారు. మనుబోలులో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అంటూ అధికారంలోకి వచ్చిన CM చంద్రబాబు వాటిని అరకొరగా అమలు చేస్తున్నారంటూ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తొలి ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు.

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. బుచ్చి(M) కొత్తమినగల్లులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ కొందరు రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తెలుసుకుని స్నేహితులతో వెళ్లి అడ్డుకున్నాడు. దీనిపై ఎదురు తిరిగిన ఇసుక మాఫియ శ్రీకాంత్పై రాడ్లు కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. మరింత సమాచారాం తెలియాల్సి ఉంది.

నెల్లూరు నగరంలో పోలీసులు వ్యభిచారం ముఠా గుట్టు రట్టు చేశారు. పోస్టల్ కాలనీ 3వ వీధిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి ఇద్దరు యువతులు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన DSP కార్యాలయానికి కూతవేటు దూరంలో జరగటం విశేషం. పట్టుబడ్డ ఇద్దరు యువతులు వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. వీరిని ఇక్కడకి తీసుకువచ్చారనేది త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపుతామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు తెలిపారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కలెక్టర్తో పాటు జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జడ్పీ సీఈఓ మోహన్ రావులు అర్జీలు స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.