Nellore

News March 7, 2025

శనివారం విద్యాసంస్థలకు సెలవు: నెల్లూరు DEO

image

నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు శనివారం సెలవు దినంగా ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా శాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తొలుత శనివారం వర్కింగ్ డేగా తొలుత ప్రకటించారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా వారి మనోభావాలను గౌరవించి సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.

News March 7, 2025

పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: క‌లెక్ట‌ర్‌

image

జిల్లాలో పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ హెచ్‌ఎంలకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో పీఎంశ్రీ నిధుల వినియోగం, పాఠశాలల్లో పెండిరగ్‌లో వున్న అభివృద్ధి పనులపై సమగ్రశిక్ష ఇంజనీర్లు, హెచ్‌ఎంలతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News March 7, 2025

రైతుల్ని ఇబ్బంది పెడితే క్రిమిన‌ల్ కేసులు: క‌లెక్ట‌ర్‌

image

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, సంబంధిత రైస్ మిల్లర్ల‌పై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్నారు.

News March 7, 2025

నెల్లూరు: విజయ డెయిరీపై టీడీపీ కన్ను

image

నెల్లూరులో కీలకమైన విజయ డెయిరీ ఛైర్మన్ పదవిపై టీడీపీ కూటమి కన్నేసింది. విజయ డెయిరీలో 15 మంది దైరెక్టర్లున్నారు. ఛైర్మన్‌గా 11 ఏళ్లుగా కొండ్రెడ్డి రంగారెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుతం మెజార్టీ డైరెక్టర్లు టీడీపీ వైపు ఉండటంతో ఛైర్మన్ పదవి కోసం పలువురు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. ఫైనల్‌గా ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో.

News March 7, 2025

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదాలు.. నలుగురు మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిన్న జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. చెన్నైలో చదువుకుంటున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరి మరణంతో నెల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. అదేవిధంగా గూడూరు మండలం తిప్పవరపాడు క్రాస్ వద్ద స్కూటీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు మున్నెయ్య, జ్యోతి మృతి చెందారు.

News March 7, 2025

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ రమణ ప్రసాద్ సూచించారు. దొరవారిసత్రంలో 80, కోటలో 80, వెంకటగిరిలో 40, గొలగమూడిలో 80, గూడూరులో 40, నార్త్ ఆములూరులో 40, వెంకటాచలంలో 40, ఆత్మకూరులో 40 సీట్లు ఉన్నాయన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేయాలన్నారు.

News March 7, 2025

నెల్లూరు: DSC అభ్యర్థులకు GOOD NEWS

image

రానున్న మెగా DSC పరీక్షకు ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా BC వెల్ఫేర్ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు, బీసీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసువాలని తెలిపారు. ఇతర వివరాలకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.

News March 7, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నెల్లూరు యువకులు దుర్మరణం

image

చెన్నైలో చదువుకుంటున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాశ్‌తో పాటు ప్రముఖ ట్రాన్స్‌పోర్టర్ అధినేత కుమారుడు ధనిశ్ రెడ్డి చెన్నైలో కారులో వెళ్తూ లారీని ఢీకొన్నారు. దీంతో స్నేహితులిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో నెల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 7, 2025

నెల్లూరు: ‘అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి’ 

image

రైతులు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ అన్నారు. కోవూరు మండలం పాటూరు, ఇనమడుగు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాలను గురువారం జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సేవా కేంద్రంలో రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

News March 7, 2025

నెల్లూరు:  ‘ధాన్యంలో నెమ్ము శాతం తేల్చాలి ‘

image

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యంలోని నెమ్ము శాతం, తరుగుపై రైతులకు ఒక స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి ఆయన జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం రైతులు, మిల్లర్లతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారని నాయుడు తెలిపారు.

error: Content is protected !!