Nellore

News August 21, 2024

మరికాసేపట్లో కండలేరుకు నీరు విడుదల

image

అనంతసాగరం మండలం, సోమశిల జలాశయం నుంచి మరికాసేపట్లో కండలేరుకు కృష్ణా జలాలను అధికారులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జలాశయంలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు రోజుల క్రితం జలాశయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించిన విషయం తెలిసిందే. తమ ప్రాంతాలకు కూడా నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.

News August 21, 2024

బ్యారేజీల పేర్ల మార్పు సరికాదు: మాజీ మంత్రి కాకాణి

image

జిల్లాలోని సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీ అని గత ప్రభుత్వంలో నామకరణం చేసిన విధంగానే కొనసాగించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బ్యారేజీలకు పెట్టిన పేర్లను టీడీపీ ప్రభుత్వం తొలగించడం సరికాదన్నారు. బ్యారేజీలకు తిరిగి పాత పేర్లను పునరుద్ధరించాలన్నారు.

News August 21, 2024

నెల్లూరు: ఈ నెల 25న చెస్ జట్ల ఎంపికలు

image

జిల్లా స్థాయి అండర్ – 9 ఓపెన్, బాలికల చెస్ పోటీలను ఈనెల 25న నిర్వహించి జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నామని చెస్ అసోసియేషన్ నెల్లూరు కార్యదర్శి మస్తాన్ బాబు తెలిపారు. రాయ్ చెస్ అకాడమీలో నిర్వహించనున్న పోటీలకు ఆసక్తి గలవారు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు.

News August 21, 2024

నెల్లూరు: ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

image

విద్యార్థులకు సరిగా బోధించకపోవడం, తదితర కారణాలతో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖధికారి పి.విజయ రామారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఆర్వి ప్రసన్నలక్ష్మి, తెలుగు పండిట్ ఎల్ శ్రీనివాసరావుపై ఆ పాఠశాల విద్యార్థులు ఇటీవల కలెక్టర్ ఆనందుకు ఫిర్యాదు చేశారు. సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

News August 21, 2024

నెల్లూరు: ఈ నెల 23న జాబ్ మేళా

image

నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి ఎమ్.వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. వివిధ కంపెనీలలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాకు హాజరు కావాలని తెలిపారు.

News August 21, 2024

నెల్లూరు: ఓపెన్ లేఅవుట్ ఖాళీ స్థలాల పరిశీలన

image

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, FCI గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు తొలగించాలని ఆదేశించారు.

News August 20, 2024

నెల్లూరు: ‘ తాను కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కట్టొద్దు’

image

తన కార్యక్రమాలలో ఎక్కడైన ఫ్లెక్సీలు కట్టిన బొకేలు, శాలువాలు ఇచ్చిన టపాసులు కాల్చిన ఆ కార్యక్రమానికి తాను హాజరుకానని.. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఎక్కడపడితే అక్కడ కట్టడం వల్ల ప్రజలకు, చిన్న చిన్న వ్యాపారస్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. తన కార్యక్రమాలలో ఎక్కడా హంగు, ఆర్భాటాలు వద్దని సూచించారు.

News August 20, 2024

నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపికలు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ ఉదయం గం.10 లకు జరుగుతాయని జిల్లా టెన్నికాయిట్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యామసుందరరావు, రమ్య తెలిపారు. ఈ ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. వచ్చేవారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు.

News August 20, 2024

తిరుపతి జిల్లా హోంగార్డుల సంక్షేమానికి పెద్దపీట

image

తిరుపతి జిల్లా పోలీసు శాఖ హోంగార్డుల సంక్షేమం కోసం పాటుపడుతుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 7 మంది హోంగార్డులకు చెక్కులు అందజేశారు. ఇటీవల అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం వారు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.4,999ల చొప్పున వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉన్నారు.

News August 20, 2024

తిరుపతి జిల్లా హోంగార్డుల సంక్షేమానికి పెద్దపీట

image

తిరుపతి జిల్లా పోలీసు శాఖ హోంగార్డుల సంక్షేమం కోసం పాటుపడుతుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 7 మంది హోంగార్డులకు చెక్కులు అందజేశారు. ఇటీవల అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం వారు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.4,999ల చొప్పున వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉన్నారు.