Nellore

News August 11, 2024

నెల్లూరు: ఆ బ్యారేజీలకు మళ్లీ పాత పేర్లే

image

జిల్లాలోని నెల్లూరు, సంగం బ్యారేజీలకు పూర్వపు పేర్లను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వంలో నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ అని అప్పటి సీఎం జగన్ నామకరణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాత పేర్లనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

News August 11, 2024

దుత్తలూరు: హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

image

దుత్తలూరు మండలం బండ కింద పల్లి జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

శ్రీకాకుళం టీంను ఓడించిన నెల్లూరు జట్టు 

image

నెల్లూరులో నేడు జరిగిన 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాకుళం టీంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెల్లూరు ఆటగాళ్లు రాణించారు. సెమీ ఫైనల్లో విజయనగరం టీంను ఢీకొట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

News August 11, 2024

ఘోరాలన్నీ ఆగస్టు 15 నుంచి బయటకొస్తాయి: సోమిరెడ్డి

image

చంద్రబాబు నిర్ణయాలతో ఆగస్టు15 నుంచి పాప ప్రక్షాళన జరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.ఆయన X వేదికగా..రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం రావడంతో స్వాతంత్ర్యం వచ్చినంత సంతోషంలో ఉన్నారన్నారు. మదనపల్లె ఫైల్స్‌ను మించిన సర్వేపల్లి కోర్టు చోరీ ఫైల్స్ వంటి ఘోరాలున్నాయని అన్నారు. ఇవన్నీ ‘ప్రజల వద్దకు పాలన’ సదస్సులో వెలుగులోకి రానున్నాయని తెలిపారు. ప్యాలెస్ నుంచి పాలన ప్రజల వద్దకు రాబోతోందన్నారు.

News August 11, 2024

నెల్లూరు: తెగిన చిన్నారి నాలుకకు కుట్లు

image

నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కుటుంబీకుల కథనం మేరకు..నాలుగురోజుల క్రితం కుక్కలకు భయపడి పరుగెత్తుతూ చిన్నారి పావని ఇనుప కడ్డీ మీద పడింది. ఆ ఘటనలో బాలిక నాలుక తెగిపోయింది. దీంతో వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా..శరీరం మొత్తం మత్తు ఇవ్వాలన్నారు. అనంతరం అక్కడ నుంచి సర్వజన ఆసుపత్రికి రాగా ఈఎన్‌టీ సుకుమార్ బృందం పాపకు ఆపరేషన్ చేసి నాలుకకు కుట్లు వేసినట్లు తెలిపారు.

News August 11, 2024

నెల్లూరు: భార్యాభర్తలు సూసైడ్

image

నెల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కె.నాగరాజు(23),సురేఖ (19) ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భార్య శనివారం ఉరివేసుకుని కన్నుమూసింది. సురేఖ మృతదేహాన్ని చూసి భరించలేక నాగరాజు అదేరోజు రైలు కింద పడి మృతిచెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News August 11, 2024

జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలి: మంత్రి ఆనం

image

జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లాపరిషత్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి కాలువల స్థితి గతులపై సోమశిల, తెలుగుగంగ, కండలేరు ప్రాజెక్టుల అధికారులతో మంత్రులు మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 

News August 10, 2024

నెల్లూరు జిల్లాలో TODAY TOP NEWS

image

➽ వ్యవసాయానికే ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి నారాయణ
➽ కోవూరు: బాలికను గర్భవతిని చేసిన కారు డ్రైవర్
➽ ఉదయగిరి: ATM కార్డుతో ఉడాయించి రూ.54వేలు డ్రా
➽ సోమశిలకు రోజురోజుకీ పెరుగుతున్న వరద
➽ దొరవారిసత్రం: లారీ బోల్తా
➽ గూడూరు: బావ చేతిలో బామ్మర్ది హత్య
➽ నాయుడుపేట తహశీల్దార్‌గా గీతా వాణి
➽ ఇందుకూరుపేట ఎంపీడీవో బదిలీ

News August 10, 2024

గూడూరు: బావ చేతిలో బామ్మర్ది హత్య 

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు బనిగిసాహెబ్ పేటలో దారుణం చోటుచేసుకుంది.  కుటుంబ కలహాల నేపథ్యంలో బావ, బామ్మర్ది మధ్య ఏర్పడిన ఘర్షణలో.. బామ్మర్ది జాకీర్‌, ఆయన చెల్లెలిపై బావ అల్లాబక్షు రోకలి బండతో దాడి చేశాడు. ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా జాకీర్ మృతి చెందాడు. ఆయన చెల్లెలి పరిస్థితి విషయంగా ఉంది. 

News August 10, 2024

మంత్రి నారాయణతో వైసీపీ ఎమ్మెల్సీలు కరచలనం

image

నెల్లూరు దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ మీద అనేక సార్లు విమర్శలు చేస్తుంటారు. అయినా మంత్రి పట్టించుకోకుండా కరచలనం ఇచ్చి ఆత్మీయంగా పలకరించారు.