India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు రూరల్ బుజబుజ నెల్లూరులో విశ్రాంత సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి (68) నివాసం ఉంటున్నారు. ఆయన మనవడు అనిల్ సాయి తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణమూర్తిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న కుమారుడు రవికుమార్ వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నెల్లూరు జిల్లా నుంచి మంత్రి ఆనం 16వ స్థానంలో నిలిచారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన గుండె మడుగుల బెనర్జీ, ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన కీర్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు కావలిలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నుంచి ప్రాణహాని ఉందని గ్రహించి కావలి డీఎస్పీ శ్రీధర్ను ఆశ్రయించారు.
38 ఏళ్ల కిందట ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు(మం), జీలపాటూరులో గ్రామదేవత పోలేరమ్మకు జాతర నిర్వహించారు. ఆ రోజు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి గొంజి మొక్కలు తీసుకుని స్వర్ణముఖినది దాటుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి అమ్మవారి జాతర చేయలేదు. మళ్లీ 38ఏళ్ల తర్వాత ఈనెల 5న జాతర చేపట్టారు. అమ్మవారి ఘటం మోస్తున్న APSP హెడ్ కానిస్టేబుల్ నరసయ్య ఇంటి దగ్గరకు రాగా..బాత్రూంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి రమేశ్ నాథ్ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ కం బయో స్టాటిస్టిక్స్ పోస్టుల భర్తీకి ఈనెల 20వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా https :/spsrnellore.ap.gov.in/notice _/requirement దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పలు కళాశాలల్లో పనిచేసిన సీనియర్ అధ్యాపకుడు బి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. గత రాత్రి దాసరిపల్లిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి భోజనం తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇందుకూరు పేట మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీదేవి అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. నరుకూరుకు చెందిన కృష్ణతేజ(20), తన భార్య శ్రావణి, ఇంటి పక్కన ఉన్న ముత్యాలు, మునెమ్మ అనే దంపతులతో కలిసి అమ్మవారి దర్శనం కోసం బుధవారం వెళ్లారు. ఈ క్రమంలో కృష్ణతేజ కోనేరులో దిగి గల్లంతయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమై 11 కేంద్రాల్లో మొదలైన ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐఓ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు అన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. 39 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆయన కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా త్వరలో మొదలుకానున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
Sorry, no posts matched your criteria.