India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 98 ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నెల్లూరు ఈఎస్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. మీరు రాసే పరీక్షల్లో ఒత్తిడి అధిగమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటలో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువై దట్టమైన పొగ మంచు కమ్మేసి మనుషుల్నే కాదు జంతువులను సైతం వణికిస్తోంది. దీంతో మనుషులే కాదు పశువులు సైతం చలికాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పచ్చని పచ్చిక బయళ్లలో, పశుశాలల్లో పెరగాల్సిన గోవులను వాటి యజమానులు రోడ్ల మీద వదిలివేయడంతో అవి దయనీయ స్థితిలో బతుకుతున్నాయని పశు ప్రేమికులు వాపోతున్నారు.
బాలిక(13)పై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదివే ఓ బాలిక రోజూ ఆటోలో స్కూల్కి వెళ్తోంది. స్కూల్ ఆటో నడిపే సతీశ్ బాలికను బీచ్కి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆటోడ్రైవర్ స్నేహితుడు సునీల్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు.
యువకులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల సమాజంలో గౌరవం పోతుందన్నారుతల్లిదండ్రులు కూడా నిరంతరం తమ బిడ్డలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్కు తెలపాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.