Nellore

News April 16, 2025

ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

image

YCP నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. పొదలకూరు(M) వరదాపురం వద్ద రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వి రూ.250కోట్లు దోచేసిన కేసులో 13 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాణి A4గా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. కోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో 7బృందాలతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

News April 16, 2025

నెల్లూరులో ఇద్దరు ఆత్మహత్య

image

పెళ్లి జరిగి ఏడాది తిరగక ముందే నెల్లూరులో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ముదివర్తిపాలేనికి చెందిన స్మైలీ(23), నాగూర్ బాబు(ఇందుకూరుపేట) 7నెలల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడో మైలులో నివాసం ఉంటుున్నారు. కులం పేరుతో నాగూర్ ఫ్యామిలీ వేధించడంతో స్మైలీ ఉరేసుకుంది. మూలాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ARకానిస్టేబుల్ నాగరాజు 9నెలల కిందట పూర్ణిమను రెండో పెళ్లి చేసుకోగా, కుటుంబ కలహాలతో పూర్ణిమ ఉరేసుకుంది.

News April 16, 2025

తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్‌గా హుస్సేన్ సాహెబ్

image

రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు గంగ‌ స్పెషల్‌ కలెక్టర్‌గా హుస్సేన్ సాహెబ్ నియమితులయ్యారు. ఆయన గతంలో నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్‌లో ఉన్న ఆయనను తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News April 16, 2025

ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు: జేసీ కార్తీక్

image

నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ కార్తీక్ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

News April 15, 2025

నెల్లూరులో కానిస్టేబుల్ భార్య సూసైడ్ 

image

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. చిన్నబజారు Ci కోటేశ్వరరావు వివరాల మేరకు.. AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో కలిసి ములాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో ఇంట్లోనే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మొదటి భార్య సైతం ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది.

News April 15, 2025

నెల్లూరు: ఇంజినీరింగ్ విద్యార్థులకు గమనిక

image

 ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 ఇంజినీరింగ్ విద్యార్థులకు సమ్మర్ ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఓ ప్రకటనలో తెలిపారు. 2 నెలలపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News April 15, 2025

నెల్లూరు చిన్నారుల గిన్నిస్ రికార్డ్

image

నెల్లూరుకు చెందిన రియో(9), జియాన్ (6) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. హైదరాబాద్‌లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న జరిగిన మ్యూజిక్ విభాగం కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మూడు  స్వరాలను 45 సెకండ్లలో పాడి రికార్డు సృష్టించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్లను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు.

News April 14, 2025

అంబేడ్కర్ చిరస్మరణీయులు: సోమిరెడ్డి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయులని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సెంటరులోని ఎస్సీ బాలికల వసతిగృహంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలసి పాల్గొన్నారు. మొదట వసతి గృహ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు సౌకర్యాలపై ఆరా తీశారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

News April 14, 2025

రాపూరు హైవేపై ఘోరం.. ఇద్దరి మృతి 

image

కారు ఇద్దరు రైతులను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డ ఘటన రాపూరులోని‌ తిక్కనవాటిక పార్కు వద్ద సోమవారం చోటుచేసుకొంది. పార్కు వద్ద ప్రధాన‌ రహదారిపై ఇద్దరు రైతులు వడ్లు ఎండబెట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఓ కారు రాజంపేట వైపు నుంచి వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ(46), గార్లపాటి సురేశ్(26) అక్కడికక్కడే మృతి చెందారు.

News April 14, 2025

అందరికీ దిశానిర్దేశకులు అంబేడ్కర్: ASP

image

సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి బీఆర్ అంబేడ్కర్ అని నెల్లూరు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.