Nellore

News February 23, 2026

NLR: ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు సిటీ DKW కళాశాలలో ఇంటర్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.

News February 23, 2026

నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

image

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్‌గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.

News February 22, 2026

నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

image

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.

News February 22, 2026

నెల్లూరు: మల్టీప్లెక్స్‌ల్లో “తెరచాటు” దోపిడి!

image

నెల్లూరువాసులకు ఆదివారం వచ్చిందంటే సినిమాలు, బీచ్‌లు, పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు. సినిమా ప్రేమికులు అయితే కుటుంబ సమేతంగా మల్టిప్లెక్స్‌లో సినిమాకి వెళ్లాలంటే రూ.2వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. టికెట్లు రూ.వెయ్యి లోపు అయినా, తినుబండారాలకు రూ.2వేలకు పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 22, 2026

నెల్లూరు: ఆ మంత్రి రూటే వేరయా..!

image

జిల్లాలో మంత్రి నారాయణ రూటే సెపరేట్ అంట. ఆయనకు పార్టీ శ్రేణుల సమన్వయంతో పనే లేదంట. కేవలం అతని అనుచరులు, అభివృద్ధి పనులే ముఖ్యమంటూ మందుకెళ్తున్నారట. మరోవైపు మంత్రి హోదాలో ఉండి పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. కాగా.. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి మంత్రికి ప్లస్ పాయింట్‌గా మారుతుందడం కలిసిచ్చే అవకాశం. అయినా పార్టీలో జోష్ నింపడంపై దృష్టి సారించాలని అంటున్నారు.

News February 22, 2026

కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

image

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.