Nellore

News April 14, 2025

నెల్లూరు: ప్రేయసితో గొడవ.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రేమలో వచ్చిన గొడవలతో ఓ యువకుడు చనిపోయాడు. నెల్లూరులోని మనుమసిద్ధినగర్‌కు చెందిన రమణమ్మ, చిన్నయ్యల చిన్న కుమారుడు పోలయ్య(25) బంగారు పనిచేస్తుంటాడు. ఈక్రమంలో స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు వచ్చాయి. మూడు రోజులుగా పోలయ్య ఎవరితోనూ మాట్లాడటం లేదు. కుటుంబ సభ్యులంతా సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పోలయ్య బెడ్ రూములోకి వెళ్లి ఉరేసుకున్నాడు.

News April 13, 2025

నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

image

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 13, 2025

రూ.2.7 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే 

image

నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ నుంచి డైకాస్ రోడ్డు వరకు రూ.2.7 కోట్లతో సెంటర్ లైటింగ్, డివైడర్, ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని, త్వరలోనే అత్యంత సుందరంగా నిర్మిస్తామని ఆయన తెలిపారు. 

News April 13, 2025

నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులకు గమనిక 

image

జోన్-3 పరిధిలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 16లోగా తెలియజేయాలని నెల్లూరు డీఈఓ బాలాజీ రావు  తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టుల కొరకు జాబితాను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.

News April 13, 2025

ఎగ్జామ్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్ 

image

ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చోసుకుంది. చింతారెడ్డిపాళెంకు చెందిన ఓ విద్యార్థి నగరంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఫలితాలలో ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్‌ తప్పాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 13, 2025

హనుమాన్ శోభయాత్ర ఏర్పాట్లపై సమీక్ష 

image

నేడు నెల్లూరులో జరగనున్న హనుమాన్ శోభయాత్ర ఏర్పాట్లు, వెళ్లే మార్గాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ ఏఆర్ దామోదర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హనుమ భక్త శోభాయాత్ర బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజలందరూ శాంతియుతంగా శోభాయాత్రలో పాల్గొనాలన్నారు. పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News April 13, 2025

మంత్రి అల్లుడి పేరుతో రూ.1.96 కోట్ల సైబర్ మోసం

image

జిల్లాలోని ఓ మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.96కోట్లు దోచేసిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 7న మంత్రి అల్లుడిని అంటూ మంత్రి సంస్థలో పనిచేసే చార్టెడ్ అకౌంటెంట్‌కు నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారు. అర్జెంటుగా రూ.1.96 కోట్లు అకౌంట్‌కు పంపాలని కోరాడు. దీంతో చార్టెడ్ అకౌంట్‌ వారి చెప్పిన అకౌంట్‌కు మనీ పంపారు. అనంతరం ఫోన్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు. 

News April 13, 2025

ఇంటర్ ఫలితాలలో కావలి విద్యార్థిని సత్తా

image

ఇంటర్ ఫలితాల్లో కావలికి చెందిన షణ్ముఖ ప్రియ సత్తా చాటింది. ఫస్టియర్ MPCలో ఆమె 464 స్కోర్ సాధించింది. దీంతో ఆమెకు స్టేట్ ర్యాంకు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.

News April 12, 2025

మత విద్వేషాలను రెచ్చగొట్టుతున్న భూమన: కాకర్ల

image

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉదయగిరి MLA కాకర్ల సురేశ్ విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోమరణాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. 

News April 12, 2025

ఉదయం 6 నుంచే పనిచేయండి: నారాయణ

image

మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.