India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం అబాక పంచాయతీలోని అమ్మలపాడు గ్రామంలో కారిమేటి ఉదయ్ కుమార్పై అతని భార్య మస్తానమ్మ సలసల కాగుతున్న వంట నూనెను పోసి చంపాలని ప్రయత్నించింది. ఉదయకుమార్కు తీవ్రగాయాలు కావడంతో సూళ్లూరుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్ ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
నెల్లూరు నగరంలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో గల జయభారత్ హాస్పిటల్ లో డయోరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారులను జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని పరీక్షలు కూడా బాగున్నాయని కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.
నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఛైర్మన్ పదవికి డిమాండ్ ఏర్పడింది. నుడా పరిధి జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉండటంతో పలువురు నాయకులు ఈ పదవిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరకు ఈ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 18 మంది ప్రత్యేక వైద్యులను తొలగించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, డెంటల్, పీడియాట్రిక్ తదితర నిపుణులను గతంలో నియమించారు. వీరు విధులకు సరిగా హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి.
నెల్లూరు జిల్లాకు 700 పొద్దు తిరుగుడు విత్తనాల కిట్స్ వచ్చాయని వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు. ఒక్కో కిట్లో 2 కిలోల విత్తనాలు ఉంటాయని, వీటిని రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలు అవసరమైన రైతులు మండల వ్యవసాయ అధికారులను లేదా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఓ రైతుకు ఒక కిట్ మాత్రమే అందజేస్తామన్నారు.
నెల్లూరుకు చెందిన వెంకట సాయిచరణ్ ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు. చిన్నచిన్న ప్యాకెట్లు చేసి బస్సుల్లో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు పంపేవాడు. ఈ క్రమంలో స్వయంగా హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుండగా మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా ఉంది. అంతేకాక పరిసర ప్రాంతాలలో పలు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అష్టలక్ష్మి దేవతలు, వినాయక స్వామి, దుర్గామాత, వెంగమాంబ ఇతర దేవత మూర్తుల విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం నుండి బ్రహ్మోత్సవాలు నిలుపుకార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, మండల వైద్యాధికారులతో డయేరియా నియంత్రణ, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
TDP పార్లమెంటరీ కోశాధికారిగా నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై నమ్మకంతో TDP పార్లమెంటరీ పార్టీ ట్రెజరర్గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.